అన్వేషించండి

Srkakulam News: శ్రీకాకుళం జిల్లాలో బియ్యం అక్రమ తరలింపుపై చూసీచూడనట్లుగా యంత్రాంగం - మేలుకునేది ఎప్పుడు?

PDS Rice Scam:శ్రీకాకుళం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థపై నిఘా కొరవడింది. పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా పెద్దగా సోదాలు చేయడం లేదు.

PDS Rice Scam in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో  మంత్రి బాధ్యతలు ఎవరు తీసుకుంటే వారికి ఘనంగా సన్మానించడం జిల్లాలో మిల్లర్లకు అనవాయితీ.. మిల్లర్ల సంఘం గత ప్రభుత్వ హాయాంలో వ్యవహరించిన తీరుతో కాస్తా అధికార పార్టీకి దూరమైనప్పటికి మళ్లీ అందులో ఉండే కొందరు ప్రతినిధులే రింగ్ మాష్టర్లవ్వడానికి చక్రం తిప్పుతున్నారు.   పీడీఎఫ్ కుంభకోణంపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

పీడీఎస్ బియ్యం  అక్రమ రవాణాపై దృష్టి సారించని అధికారులు

జిల్లాలో ఎస్సీ కేవీ మహేశ్వర రెడ్డి గంజాయిపై ఉక్కుపాదం మోపిన చందంగా జేసి ఒక్క సారి దృష్టి సారిస్తే జిల్లాలో పీడీఎఫ్ దందా గుట్టు రట్టువుతుంది. తరచుగా జిల్లాలో ఏదో ఒకమూల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండడం సాధారణంగా మారింది. అధికారులు దృష్టి సారిస్తే రేషన్ బియ్యం తరలించే వాహనాలు పట్టుబడతాయనడానికి గతంలో దాడులు చేసి పట్టుకునే వాహనాలే నిదర్శనమే. జిల్లాలో సీవిల్ సప్లై, విజిలెన్స్ అధికారులుఅక్రమ బియ్యం దందాపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలుకోరుతున్నారు. జిల్లాలో కొందరు మిల్లర్లు రేషన్ బియ్యం వ్యాపారంతోనే వారిలావాదేవీలు సాగిస్తున్నారు. ఎప్పుడైన పట్టుకున్న వాహనాల్లో రేషన్ బియ్యంస్వాధీనం చేసుకుని సదరు వాహన డ్రైవర్ లేదా మరో మధ్యవర్తిపైనో కేసులునమోదు చేస్తున్నారు. సాధారణంగానే 6 ఏ కేసులు నమోదు చేసి చేతులుదులుపుకొంటున్నారు. అనంతరం జేసీ కోర్టుకు తిరగడం సాధారణంగామారింది. పట్టుకున్న అక్రమ బియ్యం వెనుకున్న ముఠాపై ఎప్పుడు దృష్టిసారించే పరిస్థితిలేదు. దీంతో బియ్యం అక్రమ రవాణా చేసే మాఫియాకుఅడ్డుకట్ట వేయలేకపోతున్నారనేది జనం మాట. మరోవైపు పౌష్టికాహారంలోవినియోగించే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం కొందరు అక్రమార్కులు పక్కదారిపట్టిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రాఒడిశా సరిహద్దులో బియ్యం పట్టుకన్న తరువాత సైతం ఎక్కడ దాడులు జరిపిన దాఖలాలు లేవు. రాజకీయంగా, వ్యాపారస్తుల మధ్య విభేదాలున్నపుడు ఎవరైన ఫిర్యాదులు చేస్తే విజిలెన్స్ లేక సివిల్ సప్లై అధికారులుపట్టుకున్న సందర్భాలున్నాయే తప్ప ప్రత్యేక నిఘాతో దాడులు చేసి అరికట్టేపరిస్థితి లేకపోవడం గమనార్హం.

సాధారణ తనిఖీల్లోనే పెద్ద ఎత్తున పట్టుబడుతున్న బియ్యం 

జిల్లాలోని ప్రతి నెలా ఇంటింటికీ వచ్చిలబ్దిదారులకు రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.. వీటినిరాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కొంత మంది లబ్దిదారులు ఈ బియ్యం తినేందుకు నిరాకరించడం తో చిల్లరి వ్యాపారులు అటువంటి వారినుంచి కిలో రూ.20 చొప్పున కోనుగోలు చేసి వారు అక్కడ నుంచి మిల్లర్లకు అమ్ముతున్నారనే జిల్లాలో ఎప్పటినుంచే పలువురు చెబుతునే ఉన్నారు. ఈ బియ్యం కాకినాడ, విశాఖ, ఒడిశా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్గో బస్సులో పీడిఎఫ్ బియ్యం తరలిస్తుండగా అధికారులు గతంలో పట్టుకున్న సంఘట నలు పరిశీలిస్తే గత కొన్ని నెలల క్రితం కొత్తూరు మండలం నివగాం గ్రామ సమీపంలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు రూ.14 లక్షల విలువ గల 32 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం తంగివానిపేట గ్రామంలో మాధవరావుకు చెందిన గోడౌన్ నుంచి లారీలో అక్రమంగా చేస్తున్న బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. వీటివిలువ రూ 8.47 లక్షలుగా అప్పట్లో వెల్లడించారు. సరుబుజ్జిలి మండలంలో బోలేరో పికప్ వాహనంలో పీడిఎస్ బియ్యం రవాణా చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 70 బ్యాగులను సీజ్ చేశారు. ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో కోరాడ గొవిందరావు వద్ద అక్రమంగా నిల్వుంచిన 24 బస్తాలు బియ్యం విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఇలా అనేక చోట్ల ఎన్నికల ముందు రేషన్ బియ్యం సీజ్ చేశారు. దీంతో కొద్ది రోజులు అక్రమ వ్యాపారానికి బ్రేక్ పడిన అనంతరం ఎవరు పట్టించుకోకపోవడంతో జిల్లాలో యదేచ్ఛేగా పెద్ద ఎత్తున దందా సాగుతుందని విమర్శలు వస్తున్నాయి

జిల్లాలో అడ్డుకట్ట పడుతుందా?

జిల్లాలో కొందరు మిల్లర్లు దందా అంతా ఇంతా కాదు. గతంలో ఒకానొక సందర్భంగా మిల్లర్లు అక్రమవ్యాపారానికి ముక్కుతాడు వేసేందుకు విద్యుత్ మీటర్ రీడింగ్ లు సైతం నమోదు చేశారు. దీనివలన ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన ధాన్యం లేవీకి విక్రయించడం నిబంధనలు మేరకు బయటమార్కేట్ లో అమ్ముకోవడం నిర్వహిస్తారు. అడ్డగోలు వ్యాపారం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు చెక్ చెప్పవచ్చని భావించారు. ఈ తనిఖీలు కొద్ది రోజుల తరువాత బ్రేక్ పడింది. దీంతో ఎప్పుడు జిల్లాలో మిల్లర్లదే పై చేయని గతంలో జేసిలు బదిలీలే రుజువు చేశాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాలశాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గట్టిగా దృష్టి పెట్టడంతో కాకినాడ పోర్టు నుంచి అక్రమ వ్యాపారం గుట్టురట్టు అయింది. - ప్రభుత్వం ఈ దందాను అడ్డుకట్టవేసినట్టుగా జిల్లాపై దృష్టి సారిస్తే అక్రమ - వ్యాపారం, కొందరు మిల్లర్ల దందాకు చెక్ చెప్పవచ్చని ప్రజలంటున్నారు. - పవన్ కళ్యాణ్, నాదేండ్ల నిర్ణయం పట్ల ప్రజలు, ప్రజాసంఘాలు సైతం హర్షిస్తున్నాయి. ఇక్కడ బియ్యం అక్రమరవాణాకంటే రీసైక్లింగ్ చేసి విక్రయిం చడం మానవ జీవన విధానాం అస్థవ్యస్థమవుతుందాని అందుచేత ఈ అక్రమ - దందాకు చెక్ పడాలంటు స్వచ్చంద సేవా సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. 

అధికారులేమంటున్నారంటే ?

జిల్లాలో బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతుందన్న ఆరోపణలపై డీఎస్వో  జి. సూర్య ప్రకాశరావును ప్రస్తావించగా జిల్లాలో ఎటువంటి దాడులు చేయడంలేదన్నారు. గతంలో ఒడిశా తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. కాకినాడలో జరిగిన ఘటన తరువాత మిల్లులపై నిఘా పెంచారా, జిల్లాలోని ఎగుమతి అవుతున్న సరుకులుపై దృష్టి సారించారా అని ప్రశ్నిస్తే అక్కడ కు అక్రమ రవాణా చాన్స్ ఉండదంటునే తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నా నని తెలిపారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అక్రమాస్తుల కేసులో రిమాండ్‌కు జలమండలి జీఎం లక్ష్మీకుమార్
అక్రమాస్తుల కేసులో రిమాండ్‌కు జలమండలి జీఎం లక్ష్మీకుమార్
Hyderabad Corruption: అడుగుకో అవినీతి తిమింగలం - ఏసీబీ పట్టుకున్నా శిక్ష డౌటే - మరి ఎందుకు ఆగుతారు?
అడుగుకో అవినీతి తిమింగలం - ఏసీబీ పట్టుకున్నా శిక్ష డౌటే - మరి ఎందుకు ఆగుతారు?
YS Jagan: కేంద్రం పెంచిన పెట్రో రేట్లపై వైసీపీ ఆందోళనలు - కానీ బీజేపీపై విమర్శలు నిల్ - జగన్ ప్లాన్ అదేనా?
కేంద్రం పెంచిన పెట్రో రేట్లపై వైసీపీ ఆందోళనలు - కానీ బీజేపీపై విమర్శలు నిల్ - జగన్ ప్లాన్ అదేనా?
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
Petrol Price Today:పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయా? మీ సిటీలో ఏ రేటు ఉందో చూడండి!
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయా? మీ సిటీలో ఏ రేటు ఉందో చూడండి!
Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే!
Thalapathy Vijay CM: రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్
Embed widget