అన్వేషించండి

Chandrababu In Nellore: కొత్తగా వచ్చేవారిని తీసుకున్నా, పార్టీ జెండా మోసిన వాళ్లను మరిచిపోను - చంద్రబాబు భరోసా

ఏపీలో సంపూర్ణ మధ్య నిషేధం అన్నారని, కానీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే మూడో స్థానంలోం ఏపీ ఉందని గుర్తు చేశారు చంద్రబాబు.

టీడీపీలోకి కొత్తగా వచ్చేవారిని తీసుకున్నా పాతవారిని మరచిపోనని అన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరులో జోన్-4 సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రోజులు పోయాయని అన్నారు. దీనికి ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ గెలుపే నిదర్శనం అని చెప్పారు. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, ఎక్కువకాలం సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా పని చేశానన్నారు. జగనే మా భవిష్యత్ కాదని, జగనే రాష్ట్రానికి దరిద్రం అని చెప్పారు. అసలు సీఎం అయ్యాక జగన్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అన్నీ అసంపూర్తి పనులేనని చెప్పారు. 

ఏపీలో గంజాయి, గన్ కల్చర్ ఉందని.. మద్యానికి బానిసలైపోకుండా ప్రజలను కాపాడాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ నిజంగానే పేదల మనిషి అయితే ఎందుకు టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లు, బూత్ బంగ్లాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయని, ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదన్నారు. తిరుమలలో గంజాయి.. పులివెందులలో గన్ క్షల్చర్.. .నాసిరకం మద్యం.. ఏపీ పరిస్థితి ఇలా ఉందన్నారు. 

ఏపీలో సంపూర్ణ మధ్య నిషేధం అన్నారని, కానీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే మూడో స్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని, ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు. 

తమ్ముళ్లూ మీరేం చేశారో నాకు తెలిసిపోతుంది..
మీరు పని చేసే పని.. పని విధానం అంతా స్పష్టంగా నాకు తెలుస్తుంది అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను అలర్ట్ చేశారు చంద్రబాబు. నేతల పనితీరు తన సెల్ ఫోన్ కి రిపోర్ట్ రూపంలో వస్తుందన్నారు. కష్టపడి పని చేసిన వారిని ఎవరినీ మరచిపోనని హామీ ఇచ్చారు. 25 సంత్సరాల కిందటే టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ విప్లవం తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. తెలిగ్రామ్ బాట్ యాప్ ద్వారా 22 లక్షల మంది సభ్యులుగా చేరారని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండలాల నుండి క్షేత్ర స్థాయిలో పార్టీని  బలోపేతం చేసేందుకు కొత్త విధానాలను తీసుకొస్తున్నామన్నారు. ఓట్లు సంపాదించుకునేందుకు కమిట్ మెంట్ తో పని చేయాలన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లను తీసుకున్నా.. మొట్టమొదటి నుండి పార్టీ జెండాను మోసిన వారిని మరచిపోనన్నారు చంద్రబాబు. 

టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్థుల దాడుల్లో మృతి చెందితే.. వారి పిల్లలను అనాథలు కానివ్వనని అన్నారు చంద్రబాబు. వారిని ఆదుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్త అనారోగ్యంతో ఉంటే.. పార్టీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలతో సంబంధాలు లేకపోతే మనుగడ ఉండదన్నారు. ప్రజలతో మమేకం కాలేని కారణంతో మన్మోహన్ సింగ్ లాంటి నేత సైతం గెలవలేకపోయాడని గుర్తు చేశారు. మూడు పట్టభద్రుల స్థానాలు గెలిచిన ధీమాతోనే వైనాట్ పులివెందుల అని అనగలుగుతున్నామని చెప్పారు చంద్రబాబు. 

జగన్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు చంద్రబాబు. గతంలో జరిగిన పంచాయతీ, మున్సిపాల్టీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా దొడ్డిదారిలో వైసీపీవాళ్లు వచ్చారన్నారు. వాలంటరీ వ్యవస్థ ప్రజా ధనంతో పెట్టిన వ్యవస్థ అని, కానీ వారు జగన్ జపం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేస్తే వాలంటర్లకు సహకరిస్తామని చెప్పారు. ప్రజలు టీడీపీ పక్షాన ఉన్నారని, వైసీపీ వైపు రౌడీలు ఉన్నారని అన్నారు. రాజకీయాలకు అర్హతలేని వైసీపీ వారిని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget