అన్వేషించండి

Chandrababu In Nellore: కొత్తగా వచ్చేవారిని తీసుకున్నా, పార్టీ జెండా మోసిన వాళ్లను మరిచిపోను - చంద్రబాబు భరోసా

ఏపీలో సంపూర్ణ మధ్య నిషేధం అన్నారని, కానీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే మూడో స్థానంలోం ఏపీ ఉందని గుర్తు చేశారు చంద్రబాబు.

టీడీపీలోకి కొత్తగా వచ్చేవారిని తీసుకున్నా పాతవారిని మరచిపోనని అన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరులో జోన్-4 సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రోజులు పోయాయని అన్నారు. దీనికి ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ గెలుపే నిదర్శనం అని చెప్పారు. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, ఎక్కువకాలం సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా పని చేశానన్నారు. జగనే మా భవిష్యత్ కాదని, జగనే రాష్ట్రానికి దరిద్రం అని చెప్పారు. అసలు సీఎం అయ్యాక జగన్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అన్నీ అసంపూర్తి పనులేనని చెప్పారు. 

ఏపీలో గంజాయి, గన్ కల్చర్ ఉందని.. మద్యానికి బానిసలైపోకుండా ప్రజలను కాపాడాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ నిజంగానే పేదల మనిషి అయితే ఎందుకు టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లు, బూత్ బంగ్లాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయని, ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదన్నారు. తిరుమలలో గంజాయి.. పులివెందులలో గన్ క్షల్చర్.. .నాసిరకం మద్యం.. ఏపీ పరిస్థితి ఇలా ఉందన్నారు. 

ఏపీలో సంపూర్ణ మధ్య నిషేధం అన్నారని, కానీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే మూడో స్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని, ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు. 

తమ్ముళ్లూ మీరేం చేశారో నాకు తెలిసిపోతుంది..
మీరు పని చేసే పని.. పని విధానం అంతా స్పష్టంగా నాకు తెలుస్తుంది అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను అలర్ట్ చేశారు చంద్రబాబు. నేతల పనితీరు తన సెల్ ఫోన్ కి రిపోర్ట్ రూపంలో వస్తుందన్నారు. కష్టపడి పని చేసిన వారిని ఎవరినీ మరచిపోనని హామీ ఇచ్చారు. 25 సంత్సరాల కిందటే టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ విప్లవం తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. తెలిగ్రామ్ బాట్ యాప్ ద్వారా 22 లక్షల మంది సభ్యులుగా చేరారని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండలాల నుండి క్షేత్ర స్థాయిలో పార్టీని  బలోపేతం చేసేందుకు కొత్త విధానాలను తీసుకొస్తున్నామన్నారు. ఓట్లు సంపాదించుకునేందుకు కమిట్ మెంట్ తో పని చేయాలన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లను తీసుకున్నా.. మొట్టమొదటి నుండి పార్టీ జెండాను మోసిన వారిని మరచిపోనన్నారు చంద్రబాబు. 

టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్థుల దాడుల్లో మృతి చెందితే.. వారి పిల్లలను అనాథలు కానివ్వనని అన్నారు చంద్రబాబు. వారిని ఆదుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్త అనారోగ్యంతో ఉంటే.. పార్టీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలతో సంబంధాలు లేకపోతే మనుగడ ఉండదన్నారు. ప్రజలతో మమేకం కాలేని కారణంతో మన్మోహన్ సింగ్ లాంటి నేత సైతం గెలవలేకపోయాడని గుర్తు చేశారు. మూడు పట్టభద్రుల స్థానాలు గెలిచిన ధీమాతోనే వైనాట్ పులివెందుల అని అనగలుగుతున్నామని చెప్పారు చంద్రబాబు. 

జగన్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు చంద్రబాబు. గతంలో జరిగిన పంచాయతీ, మున్సిపాల్టీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా దొడ్డిదారిలో వైసీపీవాళ్లు వచ్చారన్నారు. వాలంటరీ వ్యవస్థ ప్రజా ధనంతో పెట్టిన వ్యవస్థ అని, కానీ వారు జగన్ జపం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేస్తే వాలంటర్లకు సహకరిస్తామని చెప్పారు. ప్రజలు టీడీపీ పక్షాన ఉన్నారని, వైసీపీ వైపు రౌడీలు ఉన్నారని అన్నారు. రాజకీయాలకు అర్హతలేని వైసీపీ వారిని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget