అన్వేషించండి

AP CM YS Jagan: ముఖ్యమంత్రిగారూ, నెల్లూరుకిచ్చిన హామీలు ఏమయ్యాయి ! ఎంతవరకు అమలు చేశారు ?

వరద సాయం రెండు రకాలు. తక్షణ సాయంగా డబ్బులివ్వడం, నిత్యావసరాలివ్వడం ఇందులో ఒకటి. మరోసారి వరదలు వచ్చినా వారికి నష్టం కలుగకుండా చేయడం రెండో రకం. ఇక్కడ జగన్ మొదటి సాయంలో పాసయ్యారు, కానీ..

AP CM Jagan Flood Promises: గోదావరి వరదల విషయంలో అధికార, విపక్షాలు మీరేం చేశారంటే, మీరేం చేశారంటూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గతంలో హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల విషయాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అంత దూరం అవసరం లేదు, ఏడాది క్రితం నెల్లూరు జిల్లాలో పెన్నాకు వచ్చిన వరదలనే ఉదాహరణ తీసుకుందాం. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయి..? ఎంతవరకు అమలయ్యాయి..? ఏబీపీ న్యూస్ పరీశీలనలో తేలిన నిజానిజాలివి..

రెండు రకాలుగా వరద సాయం.. 
వరద సాయం రెండు రకాలు. తక్షణ సాయంగా డబ్బులివ్వడం, నిత్యావసరాలివ్వడం ఇందులో ఒకటి. మరోసారి వరదలు వచ్చినా వారికి నష్టం కలుగకుండా చేయడం రెండో రకం. ఇక్కడ జగన్ మొదటి సాయంలో పాసయ్యారు, కానీ రెండో సాయంలో ఫెయిలైనట్లు కనిపిస్తున్నారు. గతేడాది నెల్లూరు నగర వాసులు పెన్నా వరదతో అష్టకష్టాలు పడినప్పుడు ఆయా ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. అప్పటి జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలతో కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి హామీల వర్షం కురిపించారు.

వరదలొస్తే ప్రజల సంగతేంటి..? 
అందులో ప్రధాన హామీ నెల్లూరు నగర పరిధిలో పెన్నా ఒడ్డున బండ్ నిర్మాణం. ఈ గట్టు నిర్మాణాన్ని 2022 సంక్రాంతికి మొదలు పెడతామని అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్. కట్ చేస్తే.. క్యాలెండర్లో నెలలు గిర్రున తిరిగాయి. అప్పటి మంత్రికి పదవి పోయింది, కొత్తగా మరొకరికి మంత్రి పదవి వచ్చింది. తీరా జగన్ సర్కారు చేసిందేంటంటే.. ఇదే నెలలో శంకుస్థాపన జరపడం. శంకుస్థాపనకే దాదాపు ఏడాది పడితే.. ఇక వర్షాకాలంలో పనులు సాగేదెలా, గట్టు నిర్మాణం పూర్తయ్యేలోపు వరదలొస్తే ప్రజల సంగతేంటి..?


AP CM YS Jagan: ముఖ్యమంత్రిగారూ, నెల్లూరుకిచ్చిన హామీలు ఏమయ్యాయి ! ఎంతవరకు అమలు చేశారు ?

పెన్నాలో నీరు లేకపోతే కరకట్టలపై చాలామంది పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటారు. వారంతా వరద వచ్చిన సమయాల్లో పెట్టేబేడా సర్దుకుని పరుగులు పెడుతుంటారు. అలాంటి వారికి శాశ్వత నివాసాల పేరుతో జగనన్న కాలనీలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పుడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కనీసం వచ్చే వర్షాకాలానికయినా తమకు ఇళ్లు మంజూరు చేసి తరలిస్తే.. వరదలతో హడలిపోయే ప్రమాదం తప్పుతుందని అంటున్నారు ప్రజలు.

పెండింగ్‌లో పెన్నా వారధి, సంగం వారధి 
నెల్లూరు నగర పరిధిలో పెన్నా వారధి, సంగం మండలంలో సంగం వారధి కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని కూడా వరదల సమయంలో హామీ ఇచ్చారు జగన్. కానీ ఆ రెండూ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. పనులు పూర్తయినట్టే అనిపిస్తున్నా రెండూ ప్రస్తుతం ఉపయోగంలో లేవు. ఈ రెండు వారధులు ఉపయోగంలోకి వస్తే, పెన్నా నీటిని కనీసం కొంతమేరయినా సముద్రంపాలు కాకుండా ఆపవచ్చు. సంగం వారధితో నీటిని ఉత్తర కాల్వలకు మళ్లించవచ్చు, కావలి తీరాన్ని కూడా సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది.

2022 సంక్రాంతికి ఈ రెండు వారధులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు జగన్. ఇప్పటి వరకూ పనులు పూర్తి కాకపోవడం విశేషం. ఈలోగా జలవనరుల శాఖ మంత్రి కూడా మారిపోవడంతో పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. ఎప్పటికప్పుడు సమీక్షలకే కానీ ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఈ రెండు వారధులు ఉపయోగంలోకి వస్తే, సోమశిలనుంచి నీటిని విడుదల చేసినా.. నెల్లూరు నగర వాసులు మరింత హడావిడి పడే అవకాశముండదు. ఒకేసారి వారిపై వరద ప్రవాహం విరుచుకుపడదు. ఈలోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశముంటుంది.

మొత్తమ్మీ పెన్నాకు వరదలు వచ్చి ఏడాది కావొస్తోంది. ఇప్పటి వరకూ సీఎం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా గోదావరికి వరదలొచ్చాయి. ఈ వరదల్లో అధికార, ప్రతిపక్షాలు బురద రాజకీయాలకు తెరతీశాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget