అన్వేషించండి

తూర్పు రాయలసీమలో ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు

టీచర్ల నియోజకవర్గంలో వైసీపీకి ఓటు వేస్తే, పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా అటువైపే మొగ్గుచూపే అవకాశముంది. కానీ తూర్పురాయలసీమలో సీన్ రివర్స్ అయింది. టీచర్లు ఒకటి అటు ఒకటి ఇటు వేశారని తెలుస్తోంది.

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. ఉత్తర రాయలసీమలో టీచర్ల నియోజకవర్గంలో వైసీపీ క్లియర్ విక్టరీ సాధించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా పెద్దగా తేడా లేదు. ఇక తూర్పు రాయలసీమ విషయానికొచ్చేసరికి టీచర్ల నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది, పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ విక్టరీ సాధించింది. అసలేం జరిగింది..?

టీచర్ల ఓటు, పట్టభద్రుల ఓటు ఒక పార్టీకే, లేదా ఒక పార్టీ బలపరచిన అభ్యర్థికే పడాలని రూలేమీ లేదు. కానీ టీచర్లంతా పట్టభద్రులే. వారు కచ్చితంగా రెండు ఓట్లు వినియోగించుకుంటారు. టీచర్ల నియోజకవర్గంలో వైసీపీకి ఓటు వేస్తే, పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా అటువైపే మొగ్గుచూపే అవకాశముంది. కానీ తూర్పురాయలసీమలో సీన్ రివర్స్ అయింది. టీచర్లు ఒకటి అటు ఒకటి ఇటు వేశారని తెలుస్తోంది.

టీచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. అదే సమయంలో ఆపార్టీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. ఓటమిలో కూడా పోటీ ఏమీ లేదు. నాలుగు రౌండ్లకే ఫలితం తేటతెల్లమైంది, అభ్యర్థి పేర్నాటి కౌంటింగ్ సెంటర్ విడిచి వెళ్లిపోయారు. టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ క్లియర్ విక్టరీ సాధించారు.

పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా వైసీపీ మొదటి నుంచీ వ్యూహాత్మకంగానే ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేలంతా పాజిటివ్ గానే ఉన్నారు. అన్ని చోట్లా, సభలు, సమావేశాలు పెట్టి ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యేలు కూడా స్వయంగా ప్రచారం చేశారు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది.

నెల్లూరు జిల్లాలో అప్పటి వరకూ ఇద్దరు అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు సడన్ గా రెబల్స్ గా మారడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. టీచర్ ఎమ్మెల్సీ విజేత చంద్రశేఖర్ రెడ్డికి న్యూట్రల్ ఇమేజ్ ఉండటంతో రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం కూడా ఆయనకు మద్దతు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పేర్నాటికి వ్యతిరేకంగా వారిద్దరూ పనిచేశారని, అందుకే ఓట్లు చీలిపోయాయని చెబుతున్నారు.

కందుకూరులో చంద్రబాబు సభలో ఊహించని ప్రమాదం జరిగినా.. అప్పటికే జనాల్లో టీడీపీపై కాస్తో కూస్తో సింపతీ పెరుగుతూ కనపడింది. అది ఈ ఎన్నికల్లో క్లియర్ గా తేలిపోయింది. ఇక చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ యాత్ర కూడా ఎన్నికల్లో పరోక్షంగా టీడీపీకి మేలు చేసిందనే అభిప్రాయం కూడా ఉంది. టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కి కూడా విద్యాసంస్థలు ఉండటం ఆయన కూడా విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ముందునుంచీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. చివరకు విజయం సాధించారు.

వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉందని టీడీపీ చేసిన ప్రచారం కూడా ఫలించింది. దీంతో తూర్పు రాయలసీమలో పట్టభద్రులు టీడీపీకి పట్టం కట్టారు. టీచర్లు ఒక ఓటు అటు, ఒకఓటు ఇటు వేశారు. దీంతో ఫలితం ఇలా మిశ్రమంగా వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Embed widget