అన్వేషించండి

కాంట్రాక్ట్ పనుల కోసం అరకు వెళ్లారు- వస్తూ వస్తూ సమస్యలు తెచ్చుకున్నారు

వారిద్దరూ కాంట్రాక్ట్ పనులకోసం నెల్లూరు జిల్లా నుంచి విశాఖకు వెళ్లారు. అరకులో రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరారు. ఈ క్రమంలో వారిద్దరూ గంజాయి వ్యాపారంపై దృష్టిసారించారు.

వారిద్దరూ కాంట్రాక్ట్ పనుల కోసం నెల్లూరు జిల్లానుంచి విశాఖకు వెళ్లారు. అరకులో రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరారు. అక్కడి నుంచి నెల్లూరుకి అప్పుడప్పుడూ రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో వారిద్దరూ గంజాయి వ్యాపారంపై దృష్టి సారించారు. అరకులో వారికి ఈజీగా గంజాయి దొరికేది. దాన్ని నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ లాభం ఉంటుందని భావించారు. ఇప్పటికి చాలాసార్లు ఇలా దొంగచాటుగా గంజాయిని తరలించారు. కానీ ఇప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్‌తో వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తిని అరకులో అరెస్ట్ చేస్తామని చెప్పారు.

ఏఎస్ పేట మండలం కొండమీద కొండూరు గ్రామానికి చెందిన భార్గవ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అరకు వద్ద రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఓ కాంటాక్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. భార్గవ్ రెడ్డి అరకు నుంచి గంజాయి తీసుకొస్తున్నాడని ముందస్తు సమాచారంతో నెల్లూరుపాలెం చెక్ పోస్ట్ వద్ద కాపు కాసి అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సెబ్ సిఐ నయనతార ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన భార్గవ్ రెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. అతనివద్ద ఉన్న 8కేజీల గంజాయిని సీజ్ చేశారు.

దర్గా ఉత్సవంలో గంజాయి దందా..

త్వరలో నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేటలో దర్గా గంధ మహోత్సవం జరగాల్సి ఉంది. ఆ గంధ మహోత్సవంలో గంజాయి అమ్మేందుకు భార్గవ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఇద్దరూ ప్లాన్ వేశారు. ముందుగా భార్గవ్ రెడ్డ నెల్లూరు జిల్లాకు చేరుకున్నాడు. 8కేజీల గంజాయి తీసుకుని బయలుదేరాడు. అయితే అతను గంజాయి వ్యాపారం చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వారు నెల్లూరుపాలెం చెక్ పోస్ట్ వద్ద మాటు వేశారు. సరిగ్గా భార్గవ్ రెడ్డి వచ్చే సమయానికి చుట్టుముట్టారు. అతడిని అరెస్ట్ చేశారు.

గతంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా గంజాయి రవాణా బాగా జరిగేది. నెల్లూరు మీదుగా గంజాయిని రాష్ట్రం దాటించేవారు. చిత్తూరు జిల్లాకి కూడా తరలించేవారు. పోలీసులు చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేసి గంజాయి అక్రమ రవాణాని అరికట్టేవారు. స్మగ్లర్లు ఆర్టీసీ బస్సుల్ని కూడా గంజాయి రవాణాకు ఎంపిక చేసుకునేవారు. పోలీసుల చాకచక్యంగా గంజాయి రవాణాను అడ్డుకునేవారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా గంజాయి వాడకం పెరిగిందని తెలుస్తోంది.

ఇటీవల కావలిలో గంజాయిని వినియోగిస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు ఏఎస్ పేటలో గంజాయి వినియోగిస్తున్నట్టు పోలీసులు నిర్థారిస్తున్నారు. అరకు వెళ్లిన వారు గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడానికి సిద్దమవుతున్నారు. అంటే స్థానికంగా గంజాయి వాడకంపై వారికి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు గంజాయి తీసుకొచ్చే సమయంలోనే వారిని అడ్డుకున్నారు. 8కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఏఎస్ పేట దర్గా ఉత్సవాల్లో చాటుమాటుగా గంజాయి విక్రయించాలనుకున్న వారిద్దరి ఆలోచన బెడిసికొట్టింది. ఒకరు ఇక్కడ పోలీసులకు చిక్కగా, మరొకరికోసం అరకు పోలీసుల సాయంతో నెల్లూరు పోలీసులు వెదుకులాట మొదలు పెట్టారు. అరకులో ఉన్న వ్యక్తి కూడా పోలీసులు వదిలిపెట్టేది లేదంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget