అన్వేషించండి

Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్

కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తండ్రి ఆ తప్పునకు వంతపాడాడు. ఇంకా చెప్పాలంటే ఆ తండ్రే కొడుక్కు తప్పులు నేర్పించాడు. అలా ఇద్దరూ కలసి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేసేవారు. చివరకు పోలీసులకు చిక్కారు.

తండ్రీ కొడుకులు ఇద్దరూ టీచర్లు, తండ్రీ కొడుకులు ఇద్దరూ పోలీసాఫీసర్లు, తండ్రీ కొడుకులిద్దరూ డాక్టర్లు.. ఇలా చాలామందినే చూసి ఉంటారు. కానీ తండ్రీ కొడుకులిద్దరూ దొంగలు కూడా ఉంటారు. తండ్రి దొంగ అయితే కొడుకు మంచివాడు కావొచ్చు, కొడుక్కి దొంగ లక్షణాలు వస్తే, తండ్రి మందలించే మంచి మనిషి కూడా కావొచ్చు. కానీ నెల్లూరుజిల్లాలో ఆ తండ్రీ కొడుకులు మాత్రం తోడు దొంగలు. ఇద్దరూ కలసి డ్యూటీకి వెళ్లినట్టు దొంగతనానికి వెళ్తారు. పని ముగించుకుని ఇంటికి వస్తారు, జల్సా చేస్తారు. డబ్బులైపోగానే మళ్లీ దొంగతనానికి బయలుదేరతారు. ఇదీ వారి దినచర్య. 

కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తండ్రి ఆ తప్పుకు వంతపాడాడు. ఇంకా చెప్పాలంటే ఆ తండ్రే కొడుక్కు తప్పులు నేర్పించాడు. అలా ఇద్దరూ కలసి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేసేవారు. చివరకు పోలీసులకు చిక్కారు. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం ముదివర్తి పాలెంకు చెందిన దొడ్ల సంతోష్ అతని కొడుకు సందీప్ ఇద్దరూ బైక్ దొంగతనాల్లో ఆరితేరారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 28 బైక్ లు దొంగతనం చేశారు. గతంలో ఆటోలు దొంగతనం చేసి జైలుకెళ్లొచ్చినా వీరి బుద్ధి మారలేదు. తాజాగా బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద 16 లక్షల రూపాయలు విలువ చేసే 28 బైక్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గతంలో సంతోష్, సందీప్ ఇద్దరూ ఆటో దొంగతనాలు చేసేవారు. తమ కాలనీతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆటోలు దొంగిలించి వాటిని తక్కువ రేటుకి అమ్మేసేవారు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కారు, జైలు శిక్ష అనుభవించి వచ్చారు. తాజాగా మరోసారి తమ చేతివాటం చూపించారు. ఈసారి బైక్ దొంగతనాలు నేర్చుకున్నారు. ఇటీవల నెల్లూరు నగరంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లలో పార్కింగ్ చేసిన వాహనాలు సైతం మాయమవుతున్నాయనే ఫిర్యాదు మేరకు పోలీసులు బైక్ దొంగలపై దృష్టి పెట్టారు. పాత నేరస్తుల వివరాలు సేకరించడంతో పని మరింత సులువైంది. సంతోష్, సందీప్ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి దగ్గరనుంచి 28 బైక్ లు దొంగతనం చేశారు. 

హ్యాండిల్ లాక్ వేసి ఉన్నా కూడా బైక్ తాళం సులభంగా తీసే టెక్నిక్ తెలుసుకున్నారు ఆ తండ్రీ కొడుకులు. అంతే.. ఒకదాని తర్వాత ఒకటి బైక్ లు మాయం చేసేవారు. అలా 28  బైక్ లు దొంగతనం చేసి వాటిని తమకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పెట్టారు. వాటిని అమ్మే క్రమంలో పోలీసులకు చిక్కారు. నెల్లూరు నగరం ప్రశాంతి నగర్‌ జాతీయ రహదారిపై వద్ద వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో నవాబుపేట, బుచ్చిరెడ్డిపాలెం, విడవలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాలతోపాటు తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, గూడూరు, కోట, నాయుడుపేట, తిరుచానూరు, అన్నమయ్య జిల్లా చిట్వేల్‌ ప్రాంతాల్లో బైక్‌ లు దొంగలించినట్లు నిందితులు అంగీకరించారు. దాంతో నిందితులను అరెస్టు చేసి తండ్రి దొడ్ల సంతోష్‌ పై నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 38 కేసులు ఉండటం విశేషం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget