అన్వేషించండి

Anam On Jagan Governament : ముందస్తుకెళ్తే ముందే ఇంటికి - జగన్ సర్కార్‌పై జోస్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆనం !

ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆనం.. ముందస్తుకెళ్తే ముందే ఇంటికి వెళ్లడం ఖాయమని సొంత పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.

 


Anam On Jagan Governament :   ఏపీలో తమకింకా ఏడాదిన్నరకు పైగా అధికారం ఉందని, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు నిజమైతే ముందే ఇంటికెళ్లిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టారు మాజీ మంత్రి , వెంకటగిరి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇటీవల వరుసగా ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఆయన, తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలొస్తే ముందే ఇంటికెళ్లిపోతామన్నారు.

ఆనంకు క్లారిటీ వచ్చేసిందా..?

ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరపున గడప గడప కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఆయనకు వచ్చే దఫా టికెట్ రాదని క్లారిటీ వచ్చేసినట్టుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.  అందులోనూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నేరుగా ఆయనపై నిప్పులు చెరిగారు. అధిష్టానం ఆశీర్వాదం ఉండకపోతే ఆయన అంతగా ధైర్యం చేయరు. మరో వైపు ఆయన మంత్రి కాకాణితో కూడా ఆయన టచ్ లోనే ఉన్నారు. అంటే వచ్చే దఫా వెంకటగిరి టికెట్ రామ్ కుమార్ రెడ్డికే ఖాయమైందనే వార్తలు కూడా జోరందుకున్నాయి. దీంతో రామనారాయణ రెడ్డి ఇంకాస్త  దూకుడు పెంచారన్న వాదన వినిపిస్తోంది. 

నర్మగర్భ వ్యాఖ్యలు..!

పరోక్షంగా ప్రభుత్వం పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ముందస్తు ఎన్నికలొస్తే ఇంటికెళ్లడం ఖాయమంటున్న ఆయన, ప్రజలు తమకు ఇచ్చిన పదవీకాలం పూర్తి కావొచ్చిందని, అయితే ఇంకా ప్రజలకిచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోనే ఇంకా సచివాలయాల నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదా,  లేక చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదా అనేది తనకు తెలియడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. 

సడన్ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు..!

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఆ విషయాన్ని ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తుంచుకోవాలన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాగుల వద్ద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టబోతున్నామని, త్వరలో టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు.

పదే పదే వైఎస్ఆర్ ప్రస్తావన..!

మహనీయుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెల్లూరు ప్రాంతానికి అనేక విధాలుగా సహాయ పడ్డారని గుర్తు చేశారు ఆనం. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా... తెలుగు గంగ నీరు పక్క రాష్ట్రానికి తరలిపోతుంటే ఈ ప్రాంతానికి సాగునీరు కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ...ఆ అడవి ప్రాంతానికి వచ్చి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ ప్రాంతానికి న్యాయం చేస్తాను అని మద్దతు తెలిపిన మహనీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. అధికారంలోకి రాగానే తెలుగుగంగ కాలువలకు ప్రాధాన్యత ఇచ్చి అందరికీ కూడా త్రాగునీటిని ఇచ్చిన  ఖ్యాతి వైఎస్ కే దక్కుతుందని చెప్పారు. ఆయన ఘనతను ఎప్పటికీ వెంకటగిరి వాసులు మరచిపోలేరన్నారు.

సోమశిల  స్వర్ణముఖి లింకు కాలువ పనులను పునః ప్రారంభించి సైదాపురం మండలంలో దాదాపుగా మరో 15వేల నుండి 20వేల ఎకరాలకు సాగునీటిని అందించే దిశగా అడుగులేస్తున్న తరుణంలో మధ్యలో ఆగిపోయిందని గుర్తు చేశారు ఆనం. ఈ ప్రభుత్వంలోనే సోమశిల స్వర్ణముఖి కాలువను పూర్తి చేయాలని ఆశిస్తున్నానన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన ఫలితాలు రైతాంగానికి రావాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Pushpa 2: నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
Civils Topper: 'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Pushpa 2: నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
నార్త్ ఇండియాలో 'పుష్ప' రూల్: థియేట్రికల్ రైట్స్‌‌తో కొత్త రికార్డ్స్ - ‘RRR’ను మించిపోయిందిగా!
Civils Topper: 'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి సివిల్స్ వైపు - ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ ఏం చెప్పారంటే?
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
Preethi Pagadala: మా నాన్న ముద్దు సీన్లు వద్దన్నారు, అయినా వాళ్లు వినలేదు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల
మా నాన్న ముద్దు సీన్లు వద్దన్నారు, అయినా వాళ్లు వినలేదు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Embed widget