అన్వేషించండి

Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం

అరుదైన జన్యు వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA TYPE-1)తో పోరాడుతున్న చిన్నారి పునర్విక ఘటనపై చలించిపోయిన మంత్రి నారా లోకేష్ ప్రాజెక్టు పునర్విక చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఒక మానవీయ కోణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన జన్యు వ్యాధితో పోరాడిన  చిన్నారి పునర్విక ఘటన మంత్రిని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ క్రమంలో అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లలందరికీ అండగా నిలిచేందుకు ఆయన 'ప్రాజెక్ట్ పునర్విక'ను అధికారికంగా ప్రకటించారు. అత్యంత ఖరీదైన చికిత్సలు అందక ఏ చిన్నారి ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.

ఈ ప్రాజెక్ట్ పునర్వికలో భాగంగా అరుదైన వ్యాధులకు అవసరమైన ఖరీదైన మందుల ధరలను తగ్గించేందుకు అంతర్జాతీయ ఔషధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన విధానపరమైన మద్దతును పొందేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేవలం చికిత్స అందించడమే కాకుండా, వైద్యులు, నిపుణులతో కలిసి ఈ వ్యాధులకు దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు మానసిక ధైర్యాన్ని అందించేందుకు ఒక ప్రత్యేక సపోర్ట్ సిస్టమ్‌ను కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ప్రతి చిన్నారికి సామాజిక హోదాతో సంబంధం లేకుండా సమానంగా, సులభంగా చికిత్స అందేలా చూడటమే ప్రాజెక్ట్ పునర్విక ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

నారా లోకేష్ ఆలోచనకు కారణం ఈ ఘటన..

అరుదైన జన్యు వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA TYPE-1)తో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ మానవీయతతో స్పందించారు. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన జోల్‌జెన్‌స్మా (Zolgensma) ఇంజెక్షన్ ధర రూ. 16 కోట్లు కాగా, సోషల్ మీడియా ద్వారా ప10 కోట్ల రూపాయల క్రౌడ్ ఫండింగ్ సమకూరింది. మిగిలిన బాధ్యతను మంత్రి లోకేష్ స్వయంగా తీసుకుని, ఈ ఖరీదైన మెడిసిన్‌ను  అమెరికా నుండి తెప్పించడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో ఏప్రిల్ 18న చిన్నారికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో లోకేష్ స్వయంగా హాజరై పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

అసలు ఈ SMA Type-1 వ్యాధి, దానికి వాడే ఇంజెక్షన్ ఇంత ఖరీదు ఎందుకు అనే అంశంపై చర్చ జరుగుతోంది. SMA అనేది 10 వేల మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన జన్యు లోపం. పుట్టుకతోనే SMN1 అనే జీన్‌లో వచ్చే మార్పుల వల్ల వెన్నెముకలోని నరాల కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల కండరాలు క్షీణించి పిల్లలు కనీసం ఊపిరి తీసుకోలేక, ఆహారం మింగలేక 2ఏళ్ల వయసులోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం ఈ ఇంజెక్షన్ మాత్రమే.

జోల్‌జెన్‌స్మా (Zolgensma) అనేది సాధారణ మందు కాదు. ఇది ఒక అద్భుతమైన బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రక్రియ. ఈ ఇంజెక్షన్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లాగా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు హాని చేయని ఒక వైరస్‌ను వాడుకుని, దాని ద్వారా ఆరోగ్యకరమైన SMN1 జన్యువును నేరుగా వెన్నుపాములోని నరకణాల కేంద్రకంలోకి పంపిస్తారు. అక్కడ ఇది పాడైపోయిన జన్యువు స్థానాన్ని భర్తీ చేసి, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఈ ఇంజెక్షన్ ధర 16 కోట్లు ఉండటానికి కారణం దాని తయారీలో ఉండే క్లిష్టత, అది అందించే రిజల్ట్. ఇది జీవిత కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఇచ్చే డోస్. సాధారణ మందులు కేవలం వ్యాధి లక్షణాలను తగ్గిస్తే, ఈ జీన్ థెరపీ వ్యాధి మూలాన్నే సరిచేస్తుంది. అందుకే దీని తయారీకి అయ్యే పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ ఖర్చుల కారణంగా దీని ధర భారీగా ఉంటుంది. చిన్నారి పునర్విక ప్రాణాల కోసం 10 కోట్లు క్రౌండ్ ఫండింగ్ ద్వారా వచ్చినా, మిగతా రూ.6 కోట్లను నారా లోకేష్ భరించి సమయానికి ఔషధాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబంలో ఆశలు చిగురించేలా చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
Pawan Kalyan Jindal Plant Visit: చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget