అన్వేషించండి

MLC Ashok Babu: అప్పుడే ఉద్యోగులంతా ఏకమై వ్యతిరేకిస్తే బాగుండేది.. దారుణమైన పీఆర్సీ ప్రకటించారు

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలపై ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ఇలాంటి పీఆర్సీని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

ఏపీలో ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీసేలా పీఆర్సీ జీవోలు ఉన్నాయని.. ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. రెండేళ్లు పదవి విరమణ వయసు పెంచారని ఆనందపడ్డారని చెప్పారు. 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు ఉద్యోగులంతా ఏకమై వ్యతిరేకిస్తే బాగుండేదని అశోక్ బాబు అన్నారు. జరుగుతున్న అన్యాయంపై అప్పుడే ప్రశ్నించి ఉండే.. ఇంత దూరం వచ్చేది కాదన్నారు. ఉద్యోగ సంఘాల తీరుతోనే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. 14 లక్షల ఉద్యోగుల జీతభత్యాలపై ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్నత స్థానాల్లోని వారు సరిగా మాట్లాడాలని హితవు పలికారు. వారి మాటలే.. ఉద్యోగుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని.. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అశోక్ బాబు అన్నారు. 

'చరిత్రలో దుర్మార్గంగా మిగిలిపోయే పీఆర్సీని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఓటేశారన్న విశ్వాసాన్ని కూడా సీఎం పట్టించుకోలేదు. ఉద్యోగులు భౌతిక పోరాటం చేయకుండా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం జీవోలు జారీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదు. నేను టీడీపీ నేతగా కాకుండా, మాజీ ప్రభుత్వ ఉద్యోగిగానే మాట్లాడుతున్నాను. ఉద్యోగ సంఘాల నేతల వైఖరితో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు.' అని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీఆర్సీపీ ప్రకటనపై అసంతృప్తి

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదని చెబుతున్నాయి. రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఈ పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇంత వరకూ ఏ ప్రభుత్వం కూడా  ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్ తగ్గించలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తగ్గించడమే కాకుండా..  హెచ్‌ఆర్‌ఏ, సీసీే రిటైరైన ఉద్యోగులతో క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సహా అనేక అంశాల్లో కోతలు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ సంఘాలతో ఎవరూ మాట్లాడకుండా జీవో జారీ చేశారని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయయులపై ప్రేమ లేదని.. డీఏ లు అడ్డుపెట్టుకుని  పిఆర్సీ ఇచ్చారని మండిపడ్డారు. మాకు ఈ పిఆర్సీ ఆమోదయోగ్యమైనవి కాదని..పిఆర్సీకి  జీఓలు మాకు వద్దని ప్రకటించారు. ప్రభుత్వం  మాకు  వ్యతిరేకంగా  జీఓ లు ఇచ్చిందని..ఉద్యోగ ఉపాధ్యాయ  పెన్షనర్లు   ఏక  తాటి పైకి  వచ్చి  ప్రకటించే  కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు. సమ్మె కు  వెళ్ళడానికి  కూడా సిద్ధంగా ఉన్నామని..సీఎం  జోక్యం  చేసుకోవాలని డిమాండ్ చేశారు.  రేపు, ఎల్లుండి ఉద్యోగ కమిటీ  సమావేశాలు  పెట్టుకుని కార్యాచరణ ఖరారు చేస్తామని.. ప్రకటించారు. ఇప్పటికే అన్ని జిల్లాలో  నల్ల  బ్యాడ్జీ లతో  నిరసన  తెలుపుతున్నామన్నారు.  ప్రభుత్వం జీవోలు వెనక్కి తీసుకునేవరకూ ఉద్యమం చేస్తామని ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget