అన్వేషించండి

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు

Andhrapradesh News: మంత్రి నారా లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ సంస్థల్లో సీట్లు దక్కించుకున్నారు. ఒక్క వాట్సాప్ ఫిర్యాదుతో స్పందించిన మంత్రి జీవో సైతం విడుదల చేశారు.

Minister Nara Lokesh Helped Disability Students: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) 25 మంది దివ్యాంగ విద్యార్థులు భవితవ్యాన్ని కాపాడారు. మంత్రి చొరవతో వారు ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. తమ భవితకు సాయం చేసిన లోకేశ్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయిలో విద్యా సంస్థల్లో సీట్లు దక్కినా.. ఐఐటీ మద్రాస్ తెచ్చిన కొత్త నింబధనలతో వీళ్లు ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు మార్కుల మెమో జారీ చేస్తుండగా.. వీరి ప్రవేశాలకు అది అడ్డంకిగా మారింది. దీనిపై వాట్సాప్ ద్వారా మంత్రి లోకేశ్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించిన మంత్రి మార్కుల మెమోలు సవరించి ఇవ్వడమే కాకుండా.. అందుకు అనుగుణంగా జీవో జారీ చేశారు. దీంతో ఆ 25 మంది విద్యార్థులు జాతీయ సంస్థల్లో ప్రవేశాలు పొందే ఛాన్స్ దక్కింది. వీరిని సోమవారం లోకేశ్ అభినందించనున్నారు.
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు

ఆ నిబంధన ఏంటంటే.?

ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం.. దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. ఈ క్రమంలో ఆ సబ్జెక్టుకు సంబంధించి 'E (ఎగ్జంప్షన్)' అని పేర్కొంటూ అధికారులు మెమో జారీ చేస్తున్నారు. అయితే, ఈసారి జోసా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటీ మద్రాస్ నిబంధనలు మార్చింది. ఇంటర్‌లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ఇంటర్ బోర్డు అలా మార్కుల జాబితా ఇవ్వకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందారు.

విద్యార్థి ఫిర్యాదుతో...

విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో  170వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్‌కు చెన్నై ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే, జోసా కౌన్సెలింగ్ పత్రాల పరిశీలన క్రమంలో ఇంటర్ మెమోలో 4 సబ్జెక్టులకే మార్కులు ఉండడంతో ఐఐటీ మద్రాస్ అధికారులు సీటిచ్చేందుకు నిరాకరించారు. దీంతో సత్యదేవ్ జూన్ 22న సమస్యను మంత్రి లోకేశ్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు.

వెంటనే ప్రభుత్వ జీవో

వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్.. విద్యార్థి సత్యదేవ్, ఆయన తండ్రితో మాట్లాడారు. విద్యార్థి మెమోలు 'E (EXEMPTION)' బదులుగా మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో 4 సబ్జెక్టుల సరాసరి మార్కులను 'E'గా పేర్కొన్న ఐదో సబ్జెక్టుగా వేసి కొత్త మెమో జారీ చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వ జీవో కావాలని ఐఐటీ మద్రాస్ అధికారులు స్పష్టం చేయడంతో.. వెంటనే జీవో జారీ చేయాలని.. ఐఐటీ మద్రాస్ అధికారులతో మాట్లాడాలని అధికారులకు నిర్దేశించారు. ఆఘమేఘాలపై జీవో జారీ చేయడంతో సత్యదేవ్‌కు రౌండ్ - 1లోనే సీటు దక్కింది. ఈ జీవోతో రాష్ట్రంలో 25 మందికి జాతీయ సంస్థల్లో సీట్లు దక్కాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్ కు పృధ్వీ సత్యదేవ్‌తో పాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Araku Kauni: గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
Embed widget