అన్వేషించండి

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు

Andhrapradesh News: మంత్రి నారా లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ సంస్థల్లో సీట్లు దక్కించుకున్నారు. ఒక్క వాట్సాప్ ఫిర్యాదుతో స్పందించిన మంత్రి జీవో సైతం విడుదల చేశారు.

Minister Nara Lokesh Helped Disability Students: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) 25 మంది దివ్యాంగ విద్యార్థులు భవితవ్యాన్ని కాపాడారు. మంత్రి చొరవతో వారు ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. తమ భవితకు సాయం చేసిన లోకేశ్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయిలో విద్యా సంస్థల్లో సీట్లు దక్కినా.. ఐఐటీ మద్రాస్ తెచ్చిన కొత్త నింబధనలతో వీళ్లు ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు మార్కుల మెమో జారీ చేస్తుండగా.. వీరి ప్రవేశాలకు అది అడ్డంకిగా మారింది. దీనిపై వాట్సాప్ ద్వారా మంత్రి లోకేశ్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించిన మంత్రి మార్కుల మెమోలు సవరించి ఇవ్వడమే కాకుండా.. అందుకు అనుగుణంగా జీవో జారీ చేశారు. దీంతో ఆ 25 మంది విద్యార్థులు జాతీయ సంస్థల్లో ప్రవేశాలు పొందే ఛాన్స్ దక్కింది. వీరిని సోమవారం లోకేశ్ అభినందించనున్నారు.
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు

ఆ నిబంధన ఏంటంటే.?

ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం.. దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. ఈ క్రమంలో ఆ సబ్జెక్టుకు సంబంధించి 'E (ఎగ్జంప్షన్)' అని పేర్కొంటూ అధికారులు మెమో జారీ చేస్తున్నారు. అయితే, ఈసారి జోసా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటీ మద్రాస్ నిబంధనలు మార్చింది. ఇంటర్‌లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ఇంటర్ బోర్డు అలా మార్కుల జాబితా ఇవ్వకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందారు.

విద్యార్థి ఫిర్యాదుతో...

విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో  170వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్‌కు చెన్నై ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే, జోసా కౌన్సెలింగ్ పత్రాల పరిశీలన క్రమంలో ఇంటర్ మెమోలో 4 సబ్జెక్టులకే మార్కులు ఉండడంతో ఐఐటీ మద్రాస్ అధికారులు సీటిచ్చేందుకు నిరాకరించారు. దీంతో సత్యదేవ్ జూన్ 22న సమస్యను మంత్రి లోకేశ్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు.

వెంటనే ప్రభుత్వ జీవో

వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్.. విద్యార్థి సత్యదేవ్, ఆయన తండ్రితో మాట్లాడారు. విద్యార్థి మెమోలు 'E (EXEMPTION)' బదులుగా మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో 4 సబ్జెక్టుల సరాసరి మార్కులను 'E'గా పేర్కొన్న ఐదో సబ్జెక్టుగా వేసి కొత్త మెమో జారీ చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వ జీవో కావాలని ఐఐటీ మద్రాస్ అధికారులు స్పష్టం చేయడంతో.. వెంటనే జీవో జారీ చేయాలని.. ఐఐటీ మద్రాస్ అధికారులతో మాట్లాడాలని అధికారులకు నిర్దేశించారు. ఆఘమేఘాలపై జీవో జారీ చేయడంతో సత్యదేవ్‌కు రౌండ్ - 1లోనే సీటు దక్కింది. ఈ జీవోతో రాష్ట్రంలో 25 మందికి జాతీయ సంస్థల్లో సీట్లు దక్కాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్ కు పృధ్వీ సత్యదేవ్‌తో పాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
NTR New Movie: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
NTR New Movie: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Embed widget