అన్వేషించండి

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు

Andhrapradesh News: మంత్రి నారా లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ సంస్థల్లో సీట్లు దక్కించుకున్నారు. ఒక్క వాట్సాప్ ఫిర్యాదుతో స్పందించిన మంత్రి జీవో సైతం విడుదల చేశారు.

Minister Nara Lokesh Helped Disability Students: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) 25 మంది దివ్యాంగ విద్యార్థులు భవితవ్యాన్ని కాపాడారు. మంత్రి చొరవతో వారు ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. తమ భవితకు సాయం చేసిన లోకేశ్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయిలో విద్యా సంస్థల్లో సీట్లు దక్కినా.. ఐఐటీ మద్రాస్ తెచ్చిన కొత్త నింబధనలతో వీళ్లు ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు మార్కుల మెమో జారీ చేస్తుండగా.. వీరి ప్రవేశాలకు అది అడ్డంకిగా మారింది. దీనిపై వాట్సాప్ ద్వారా మంత్రి లోకేశ్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించిన మంత్రి మార్కుల మెమోలు సవరించి ఇవ్వడమే కాకుండా.. అందుకు అనుగుణంగా జీవో జారీ చేశారు. దీంతో ఆ 25 మంది విద్యార్థులు జాతీయ సంస్థల్లో ప్రవేశాలు పొందే ఛాన్స్ దక్కింది. వీరిని సోమవారం లోకేశ్ అభినందించనున్నారు.
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు

ఆ నిబంధన ఏంటంటే.?

ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం.. దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. ఈ క్రమంలో ఆ సబ్జెక్టుకు సంబంధించి 'E (ఎగ్జంప్షన్)' అని పేర్కొంటూ అధికారులు మెమో జారీ చేస్తున్నారు. అయితే, ఈసారి జోసా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటీ మద్రాస్ నిబంధనలు మార్చింది. ఇంటర్‌లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ఇంటర్ బోర్డు అలా మార్కుల జాబితా ఇవ్వకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందారు.

విద్యార్థి ఫిర్యాదుతో...

విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో  170వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్‌కు చెన్నై ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే, జోసా కౌన్సెలింగ్ పత్రాల పరిశీలన క్రమంలో ఇంటర్ మెమోలో 4 సబ్జెక్టులకే మార్కులు ఉండడంతో ఐఐటీ మద్రాస్ అధికారులు సీటిచ్చేందుకు నిరాకరించారు. దీంతో సత్యదేవ్ జూన్ 22న సమస్యను మంత్రి లోకేశ్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు.

వెంటనే ప్రభుత్వ జీవో

వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్.. విద్యార్థి సత్యదేవ్, ఆయన తండ్రితో మాట్లాడారు. విద్యార్థి మెమోలు 'E (EXEMPTION)' బదులుగా మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో 4 సబ్జెక్టుల సరాసరి మార్కులను 'E'గా పేర్కొన్న ఐదో సబ్జెక్టుగా వేసి కొత్త మెమో జారీ చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వ జీవో కావాలని ఐఐటీ మద్రాస్ అధికారులు స్పష్టం చేయడంతో.. వెంటనే జీవో జారీ చేయాలని.. ఐఐటీ మద్రాస్ అధికారులతో మాట్లాడాలని అధికారులకు నిర్దేశించారు. ఆఘమేఘాలపై జీవో జారీ చేయడంతో సత్యదేవ్‌కు రౌండ్ - 1లోనే సీటు దక్కింది. ఈ జీవోతో రాష్ట్రంలో 25 మందికి జాతీయ సంస్థల్లో సీట్లు దక్కాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్ కు పృధ్వీ సత్యదేవ్‌తో పాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Embed widget