అన్వేషించండి

Nara Lokesh: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ప్రభుత్వం అడుగులు - కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్

Andhra News: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది.

AP Government Established Consultative Forum: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed Of Doing Business) దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం (Consultative Forum) ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది. ఫోరం ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ పోరం పని చేయనుంది. రెండేళ్ల కాల పరిమితితో ఫోరం పని చేయనుండగా.. ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు సంస్థల ఆసక్తి

అటు, రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా, శనివారం లులు గ్రూప్స్ ఛైర్మన్ యూసఫ్ అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ అప్పట్లో ఒప్పందం చేసుకుంది. అనంతరం వైసీపీ హయాంలో లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తాము తీసుకొస్తున్న నూతన పాలసీల గురించి లులు గ్రూప్ ఛైర్మన్‌కు వివరించారు. అనంతరం లులు గ్రూప్ చైర్మన్‌తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. కాగా, రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. 

Also Read: TTD : టీటీడీ కొత్త చైర్మన్ ఎంపిక పెద్ద టాస్క్ - రాజకీయేతరులకే చంద్రబాబు చాన్స్ ఇవ్వబోతున్నారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
First Selfie: భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
First Selfie: భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Vijayawada News: విజయవాడలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన తల్లి
విజయవాడలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన తల్లి
Arshad Warsi: ‘జోకర్’ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్‌స్టాప్ - నేను ప్రభాస్‌ని అనలేదంటూ!
‘జోకర్’ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్‌స్టాప్ - నేను ప్రభాస్‌ని అనలేదంటూ!
Aditi Shankar: 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?
'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?
Cyber Crime: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు - విశాఖలో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన సీబీఐ, తెలంగాణలో ఒకే ఖాతాలోకి రూ.124 కోట్లు
Embed widget