By: ABP Desam | Updated at : 11 Mar 2022 01:10 PM (IST)
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Governament ) వ్యవసాయ , అనుబంధ శాఖల బడ్జెట్ను రూ. 43, 052. 78 కోట్లను ప్రతిపాదించారు మంత్రి కురసాల కన్నబాబు ( Minister Kannababu ) . ఇందులో వ్యవసాయ రంగానికి ( Agriculture ) రూ. 11,387.69 కోట్లను ప్రతిపాదించారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కురసాల కన్నబాబు శాసనసభలో( Assembly ) ప్రవేశపెట్టారు. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 614.23 కోట్లు కేటాయించినట్లు కన్నబాబు వెల్లడించారు. అలాగే సహకార శాఖకు రూ. 248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి 146.41 కోట్లు, ఉద్యానశాఖకు 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 98.99 కోట్లు కేటాయించారు.
2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి
ఆచార్య ఎంజీ రంగా ( NG Ranga ) వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్లు, మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు. వైఎస్సార్ జలకళకు 50 కోట్ల కేటాయింపులతో పాటు నీటి పారుదల రంగానికి 11450.94 కోట్ల ప్రతిపాదన ఉంచింది ఏపీ ప్రభుత్వం.
పోలవరం పూర్తిపై బడ్జెట్లో కీలక ప్రకటన, ప్రాజెక్టు పూర్తిపై క్లారిటీ
రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ( YS Jagan ) ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని జల కళ ( Jala kala ) వంటి పథకాలను సీఎం జగన్ ప్రారంభించారని వచ్చే ఆర్థిక సంవత్సరంలో యాభై వేల బోర్లను ఉచితంగా వేయడంతో పాటు మోటార్లను కూడా అందిస్తామన్న కన్నబాబు ప్రకటించారు.
నగరిలో ఈ సారి స్టార్ వార్ - రోజాపై పోటీకి వాణీ విశ్వనాథ్ సై !
వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుబంధం చేస్తామని మంత్రి కన్న బాబు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఉపాధి హామీ ద్వారా అరవై శాతం ఉపాధిహామీ పనులు చేసే అవకాశం ఉందని కన్నబాబు తెలిపారు. డాక్టర్, ఇంజినీర్ల వంటి వారి అవసరం ఎప్పుడో ఓ సారి వస్తుందని కానీ రైతు అవసరం మాత్రం ప్రతీ రోజూ మూడు పూటలా ఉందని కన్నబాబు అన్నారు.. అందుకే రైతు దేవోభవ అంటూ ప్రసంగాన్ని ముగించారు.
TDP Political Action Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- బాలకృష్ణకు చోటు
Top Headlines Today: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు- 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్లు ప్రారంభం!
AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై మలయ్యప్పస్వామి- రామకృష్ణ గోవింద అలంకారంలో దర్శనం
Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్ప్రెస్లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>