అన్వేషించండి

Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్

Pawan Kalyan Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 నుంచి యాత్ర ప్రారంభిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు.

Pawan Kalyan Yatra : జనసేన ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం మంగళగిరిలో జరిగింది. ఈ ఐటీ సమ్మిట్‌లో 600 మంది నిపుణులు పాల్గొన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమాన్ని జనసేన చేపట్టిందన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ విభాగం కీలకమన్నారు. ఐటీ విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసే విధంగా పనిచేయాలన్నారు. రాజకీయాల్లో సోషల్ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 నుంచి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ పర్యటనలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

యువతి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు

వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అంటూ అభివృద్ధిని విస్మరించిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులలు రాకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందని ఆరోపించారు. జనసేన సరికొత్త ఐటీ పాలసీతో ముందుకు వస్తుందన్నారు. ఈ పాలసీ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు ఉపయోగపడుతోందన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేలా ఐటీ పాలసీ ఉంటుందన్నారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఐటీలో హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఎందుకలా చేయలేకపోతుందని బాధ కలుగుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. 

ఐటీ రంగం కీలకం 

"ఏపీలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుందని ఐటీ రంగమే. దేశం గర్వించే స్థాయిలో తెలుగు వారు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఐటీ రంగంలో 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయన్నది ఒక అంచనా. ఏపీలో పరిస్థితులు రోజు రోజుకీ దారుణంగా మారుతోంది. హైదరాబాద్ ఐటీకి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి నగరాలు అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాయి. అమరావతి సహా ఏ నగరంలోనూ పెట్టుబడులు పెట్టే సౌకర్యాలు కల్పించలేకపోయింది ఏపీ ప్రభుత్వం." - నాదెండ్ల మనోహర్  

ఐటీ సదస్సు 

జనసేన పార్టీ ఐటీ సమన్వయకర్తలు, ఐటీ వలంటీర్ల సమావేశం ఆదివారం మంగళగిరిలో జరిగింది. పార్టీ కార్యక్రమాలకు ఐటీ నిపుణులు సహాయసహకారాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పార్టీ నేతలు, శ్రేణులు సమర్థంగా వినియోగించుకోవడం గురించి ఐటీ నిపుణులు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ఐటీ సెల్ ఛైర్మన్ శ్రీనివాస్ మిరియాల పాల్గొన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ కల్యాణ్

దేశ స్వాతంత్య్ర అమృతోత్సవ వేడుకలను మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు (15వ తేదీ) ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  

Also Read : Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా

Also Read : TDP Politics: టీడీపీలో వర్గపోరు - కళా వెంకట్రావును తప్పించారా ! అసలేం జరుగుతోంది?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Allari Naresh: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
Embed widget