అన్వేషించండి

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు

No Bail: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. కొంత మంది నిందితులకు బెయిల్ రావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరికి నిరాశే ఎదురయింది.

Andhra Pradesh liquor scam:  ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్‌లో  ఏడుగురు ముఖ్య నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను ఆంటీ-కరప్షన్ బ్యూరో  కోర్టు తిరస్కరించింది.  వైసీపీ ఎంపీ పీ.వి. మిధున్ రెడ్డితో పాటు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా మరో ఇద్దరు బెయిల్ పొందారు. వారి బెయిల్స్ రద్దు చేయాలని సిట్ హైకోర్టును ఆశ్రయించింది.  ఈక్రమంలో తమకూ బెయిల్స్ వస్తాయని  ఆశించిన నిందితులకు ఎదురు దెబ్బ తగిలింది.  రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి,భూనేటి చాణిక్య, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.                             

ఈ నిందితులు అక్రమ డబ్బు రవాణా, లైసెన్సు కుంభకోణాల్లో పాలుపంచుకున్నారని దర్యాప్తులో తేలిందని సిట్ చెబుతోంది. వారు అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఏడుగురు నిందితులు వేర్వేరుగా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరు వర్గాల న్యాయవాదులు  వాదనలు వినిపించారు. నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలని, దర్యాప్తులో సహకరిస్తామని వాదించారు. అయితే, ఏసీబీ తరపు న్యాయవాదులు నేరం తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు పూర్తి కాకపోవడాన్ని ఆధారంగా చూపి వ్యతిరేకించారు.                     

వాదనలు పూర్తయిన తర్వాత, ఏసీబీ కోర్టు అందరి పిటిషన్‌లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. "నేరం తీవ్రమైనది, దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్‌కు అర్హత లేదు" అని కోర్టు స్పష్టం చేసింది. హైకర్టు .. బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వచ్చే వరకూ ..  దిగువ కోర్టు   బెయిల్ పిటిషన్లను విచారించవద్దని సూచించింది. ఈ తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సుప్రీం కోర్టు ఇటీవల హైకోర్టు ఆర్డర్‌లపై జోక్యం చేసుకుని, బెయిల్  పిటిషన్‌లు మెరిట్స్‌పై విచారించమని ఆదేశించింది. దీంతో విచారణ జరిపిన ఏసీబీ కోర్టు బెయిల్స్ ను తిరస్కరించింది.                

 మద్యం కుంభకోణం  కేసులో  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ( నిందితుల్లో A-38గా ఉన్నారు.  ఆయనను జూన్ 18,న బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు.  వెంకటేష్ నాయుడుతో కలిసి శ్రీలంకకు  వెళ్తుండగా సిట్ అధికారులు  అరెస్టు చేశారు. ఆ తర్వాత విజయవాడకు తీసుకొని వచ్చి ఏసీబీ కోర్టులో హాజరు చేశారు. అప్పటి నుంచి  విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  రాజ్ కేసిరెడ్డి  ఏప్రిల్ లో అరెస్టయ్యారు. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు చురుకుగా సాగుతోంది. కొంత మంది బెయిల్ రావడంతో..దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని సిట్ అధికారులు అంటున్నారు. బెయిల్ వస్తుందని చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో .. పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
Nuvvu Naaku Nachav Re Release: జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
Advertisement

వీడియోలు

Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
Nuvvu Naaku Nachav Re Release: జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Krishna Scrub Typhus Fever: కృష్ణా జిల్లాలో  వింత జ్వరాలు!
కృష్ణా జిల్లాలో వింత జ్వరాలు! "స్క్రబ్ టైఫస్ "తో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం అంటున్న డాక్టర్లు
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Embed widget