అన్వేషించండి

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలో ఆలయాల మూసివేత, ఎప్పటి వరకంటే?

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆలయాలను మూసివేస్తున్నారు. కాణిపాకం, తిరుమలలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మూసి వేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలను మూసివేయబోతున్నట్లు ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకు ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసివేయబోతున్నారు. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయడంతో మాడా వీధులు, క్యూ లైన్లు బస్టాండులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈరోజు ఉదయం 8:30 గంటలు నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పుణ్యా వచనం, ఆలయ శుద్ధి అనంతరం రేపు ఉదయం 4:30 గంటలకి గోపూజ, స్వామికి  అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు ఉదయం 8 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం అవుతుంది అని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు కోదండపాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయాన్ని మూసి వేసిన అధికారులు..

చంద్రగ్రహణం కారణంగా దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయంను మూసి వేయనున్నారు టీటీడీ అధికారులు. మంగళవారం ఉదయం 8:41 గంటలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ తలుపులను మూసి వేశారు. నేటి మధ్యాహ్నం 2:39 గంటల నుండి సాయంత్రం 6:27 గంటల వరకూ చంద్రగ్రహణం గ్రహణం ఉంటుంది. దీంతో 11 గంటల ముందే అంటే ఉదయం 8:41 గంటలకే శ్రీవారి ఆలయాన్ని మూసి వేశారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు శ్రీవారి ఆలయంను తెరిచి ఆలయ శుద్ది చేపట్టిన అనంతరం పుణ్య వచనం చేసి రాత్రి కైంకర్యాలను నిర్వహిస్తారు.  సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం నిర్వహించిన పిమ్మట సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించనుంది టిటిడి.

ఇక చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో నవంబరు 8వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలు రద్దు చేసింది. ఇక గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ తాత్కాలికంగా నిలిపి వేసింది‌ టీటీడీ. ఈ విష‌యాల‌ను గుర్తించి భ‌క్తులు టీటీడీ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

నంద్యాల జిల్లా శ్రీశైలం...

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆళయంలో చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, 3.30గంటలకు నుండి సుప్రభాతసేవ, 4.30గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల మహా మంగళ హారతులు నిర్వహించారు. మహా మంగళ హారతి సమయం నుండే భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం జరిగింది. తదుపరి ఉదయం 6.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసి వేశారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన తరువాత ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు చేస్తారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. గ్రహణం కారణంగా అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలుపుదల చేశారు. గ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేస్తున్నారు. రాత్రి 8గంటల నుంచి అల్పాహారం అందిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget