అన్వేషించండి

Lokesh And Pawan: స్మార్ట్ కిచెన్‌లో కుచ్‌కుచ్‌ హోతాహై- లోకేష్ ట్వీట్ డిలీట్, పవన్ కౌంటర్; అసలేం జరిగిందంటే?

Nara lokesh: కడపలో మధ్యాహ్న భోజన పథకం క్యాంటీన్ పై లోకేష్ ట్వీట్ చేసి డిలీట్ చేశారు. అది పవన్ కల్యాణ్ సొంత నిధులతో కట్టించారు. ఆ ప్రస్తావన ట్వీట్ లో లేకపోవడంతో డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

Lokesh deleted tweet on mid day meal canteen: రాజకీయాల్లో చిన్న చిన్న మిస్ అండర్ స్టాండింగ్స్ కూడా పెద్ద సమస్యలు సృష్టిస్తాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. నారా లోకేష్ ఈ విషయంలో  చురుకుగా స్పందించారు. ఓ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు.  

కడపలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కోసం ఓ స్మార్ట్ కిచెన్ ను నిర్మించారు. ఈ కిచెన్ గొప్పతనం గురించి చెబుతూ నారా లోకేష్  ట్వీట్ చేశారు. ప్రతి రోజు పన్నెండు గవర్నమెంట్ స్కూల్స్‌కి, 2200 మంది విద్యార్థులకు ఈ క్యాంటీన్ నుంచి భోజనం  వెళ్తోంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యాప్ లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఇలాంటివే మరో నాలుగు స్మార్ట్ కిచెన్స్ సిద్ధమవుతున్నాయని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Lokesh And Pawan: స్మార్ట్ కిచెన్‌లో కుచ్‌కుచ్‌ హోతాహై- లోకేష్ ట్వీట్ డిలీట్, పవన్ కౌంటర్; అసలేం జరిగిందంటే?

కాసేపటికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఓ ట్వీట్ పోస్టు అయింది. పవన్ కల్యాణ్   గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించానని పవన్ తెలిపారు.  ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.  

చంద్రబాబు, లోకేష్  తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయని పోస్టు పెట్టారు.  

పవన్ కల్యాణ్ పోస్టులో కౌంటర్ ఇచ్చినట్లుగా లేదు కానీ.. లోకేష్ పెట్టిన పోస్టులో ఆ స్మార్ట్ కిచెన్ కు నిధులు ఇచ్చిన పవన్ కల్యాణ్ పేరు లేదు. ఆ విషయాన్ని పవన్ స్పష్టంగా చెప్పినట్లుగా ఉండటంతో.. లోకేష్ తన ట్వీట్ ను డిలీట్ చేశారు. 

పూర్తిస్థాయిలో నిధులు ఇచ్చిన పవన్ కల్యాణ్ పేరు ట్వీట్ లో లేకపోవడంతో నారా లోకేష్ వెంటనే  అప్రమత్తమయ్యారు.  సాధారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధుల సోషల్ మీడియా అకౌంట్లను ఏజెన్సీలు నిర్వహిస్తూ ఉంటాయి. అయితే వారు ఎలాంటి ట్వీట్లు పెట్టమని చెబుతారో అవే పెడతారు. నారాలోకేష్ ఈ స్మార్ట్ కిచెన్ అంశంపై ట్వీట్ పెట్టమని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసే వారికి చెప్పి ఉంటారు కానీ.. ఆ కంటెంట్ ను సరిగ్గా పరిశీలించకపోవడంతో   పోస్టు అయి ఉంటుందని..  విషయం తెలియగానే డిలీట్ చేయించారని భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
Embed widget