అన్వేషించండి

Andhra Labor Adda: ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన

Labor Adda: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యాధునిక లేబర్ అడ్డా లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

Andhra Labor Adda CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో కార్మికుల పాత్రను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. మే డేను పురస్కరించుకుని శ్రమశక్తి పురస్కారాలు అందించారు.  

ఈ లేబర్ అడ్డాలు కేవలం కార్మికులు వేచి చూసే కేంద్రాలు మాత్రమే కాకుండా, పని లేని రోజుల్లో వారి నైపుణ్యాన్ని పెంచే  స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు గా మారుతాయని ఆయన స్పష్టం చేశారు. తొలి దశలో అమరావతితో సహా 15 ప్రధాన నగరాల్లో వీటిని నిర్మిస్తామని, కార్మికులకు అత్యాధునిక పనిముట్లతో పాటు ఈఎస్ఐ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి పునర్ వైభవం తెచ్చే క్రమంలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కాలపరిమితిని విధించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కృష్ణా జిల్లా ముఖచిత్రాన్ని మార్చే  బందరు పోర్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే, బీచ్ రోడ్డు విస్తరణ వంటి పనుల ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం, వైసీపీని  గొడ్డలి పార్టీ గా అభివర్ణించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేసిన సంస్కృతి వారిదని, కానీ తమ కూటమి ప్రభుత్వం విధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మిస్తోందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మరోమారు స్పష్టం చేస్తూ, సంక్షేమం కోసం ప్రతీ నెలా రూ.2,721 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని, ఇది దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తోందని, ప్రజల సహకారమే తమకు శ్రీరామరక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.

విద్యా మరియు పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వచ్చిన మార్పులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ప్రశంసించారు. కార్మికుల పిల్లలు కూడా రేపు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని చెబుతూ, శ్రమశక్తి పురస్కారాలను అందజేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేల పనితీరుపై నేరుగా ప్రజల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానని చెప్పడం ద్వారా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా సీఎం గట్టి సంకేతాలిచ్చారు.                    

టాప్ హెడ్ లైన్స్

YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక పోరు - జగన్ ఆశలపై కూటమి నీళ్లు - అంతర్గత పోరును తలకిందులు చేస్తున్న బాబు-పవన్ వ్యూహం?
ఏపీ స్థానిక పోరు - జగన్ ఆశలపై కూటమి నీళ్లు - అంతర్గత పోరును తలకిందులు చేస్తున్న బాబు-పవన్ వ్యూహం?
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget