అన్వేషించండి

YS Jagan: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వెబ్ కాస్టింగ్ ఫుటేజీ వైసీపీకి ఇచ్చే దమ్ముందా ? జగన్ ప్రశ్న

Jagan About Pulivendula ZPTC Election | ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా, ఇంత దారుణంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

Pulivendula ZPTC Election | తాడేపల్లి: ఏపీలో శాంతి భద్రతలు లేవు. ప్రజాస్వామ్యం అసలే లేదు అనడానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి బయటకు పంపించి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించిన వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్‌ ఫుటేజీని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. 15 పోలింగ్‌ బూత్‌లలో తమ పార్టీ ఏజెంట్లు లేకుండా చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఏపీలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు అన్నారు వైఎస్‌ జగన్‌. కేంద్ర బలగాల రక్షణలో ఈ ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పోలింగ్ బూత్‌లు మార్చడం ఏంటి..

ఏ ఊరిలో వాళ్లు అదే ఊరిలో ఓట్లు వేస్తారు. ప్రతి ఎన్నికల్లో అదే జరుగుతుంది. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లను మార్చారు. ఎర్రబల్లి, నల్లపురెడ్డిపల్లికి పోలింగ్ బూత్‌లు మార్చారని జగన్ ప్రదర్శించారు. ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లి ఓటు వేసి రావడం వింతగా ఉందన్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి ఇక్కడి నుంచే స్కెచ్ మొదలైంది. 4 వేల ఓట్ల పరిస్థితి ఇలా ఉంది. జనాల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయకుండా చేశారు. కొందర్ని బెదిరించి తమకు ఓటు వేసేలా చేశారు. 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోసం కాదు, వారిని బెదిరించడానికి పోలీసుల్ని తెచ్చారు. ఇతర జిల్లాల నుంచి మనుషుల్ని తెచ్చి పోలీసుల సమక్షంలో బూత్ కు 400 మందిని సెట్ చేశారు. 

కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు..

పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయటి నుంచి వచ్చిన టీడీపీ నేతలు, వారి మనుషులు ఏడు, ఎనిమిది వేల మంది వచ్చారు. ఒక్కో ఓటరుకు ఒక్కో రౌడీని ఏర్పాటు చేసిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎవరైనా అంటారా. మంత్రి సవిత, ఆదినారాయణ రెడ్డి మనుషులు, టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య మనుషులు ఈ కొత్తపల్లిలో మఖాం వేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటర్ కాదు. కానీ ఆయన కూడా కనంపల్లికి వచ్చి దౌర్జన్యం చేశారు. పోలింగ్ బూత్ ల నుంచి వైసీపీ ఏజెంట్లను వెళ్లగొట్టి ఎన్నికలు జరిపారు. జమ్మలమడుగులో కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్నా పట్టించుకోలేదు.

 

రెండు బూత్ లలో రీపోలింగ్..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్‌ జరుగుతోంది.  3, 14 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం (ఆగస్టు 12న) ఉప ఎన్నికలు నిర్వహించారు.  నిరసనల మధ్య పోలింగ్‌ జరిగింది. ఒంటిమిట్టలో 81.53 శాతం, పులివెందులలో 76.44 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు స్థానాల్లోనూ 11 మంది అభ్యర్థుల చొప్పున పోటీ చేశారు. పులివెందులలో టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget