అన్వేషించండి

YS Jagan: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వెబ్ కాస్టింగ్ ఫుటేజీ వైసీపీకి ఇచ్చే దమ్ముందా ? జగన్ ప్రశ్న

Jagan About Pulivendula ZPTC Election | ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా, ఇంత దారుణంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

Pulivendula ZPTC Election | తాడేపల్లి: ఏపీలో శాంతి భద్రతలు లేవు. ప్రజాస్వామ్యం అసలే లేదు అనడానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి బయటకు పంపించి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించిన వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్‌ ఫుటేజీని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. 15 పోలింగ్‌ బూత్‌లలో తమ పార్టీ ఏజెంట్లు లేకుండా చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఏపీలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు అన్నారు వైఎస్‌ జగన్‌. కేంద్ర బలగాల రక్షణలో ఈ ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పోలింగ్ బూత్‌లు మార్చడం ఏంటి..

ఏ ఊరిలో వాళ్లు అదే ఊరిలో ఓట్లు వేస్తారు. ప్రతి ఎన్నికల్లో అదే జరుగుతుంది. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లను మార్చారు. ఎర్రబల్లి, నల్లపురెడ్డిపల్లికి పోలింగ్ బూత్‌లు మార్చారని జగన్ ప్రదర్శించారు. ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లి ఓటు వేసి రావడం వింతగా ఉందన్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి ఇక్కడి నుంచే స్కెచ్ మొదలైంది. 4 వేల ఓట్ల పరిస్థితి ఇలా ఉంది. జనాల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయకుండా చేశారు. కొందర్ని బెదిరించి తమకు ఓటు వేసేలా చేశారు. 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోసం కాదు, వారిని బెదిరించడానికి పోలీసుల్ని తెచ్చారు. ఇతర జిల్లాల నుంచి మనుషుల్ని తెచ్చి పోలీసుల సమక్షంలో బూత్ కు 400 మందిని సెట్ చేశారు. 

కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు..

పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయటి నుంచి వచ్చిన టీడీపీ నేతలు, వారి మనుషులు ఏడు, ఎనిమిది వేల మంది వచ్చారు. ఒక్కో ఓటరుకు ఒక్కో రౌడీని ఏర్పాటు చేసిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎవరైనా అంటారా. మంత్రి సవిత, ఆదినారాయణ రెడ్డి మనుషులు, టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య మనుషులు ఈ కొత్తపల్లిలో మఖాం వేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటర్ కాదు. కానీ ఆయన కూడా కనంపల్లికి వచ్చి దౌర్జన్యం చేశారు. పోలింగ్ బూత్ ల నుంచి వైసీపీ ఏజెంట్లను వెళ్లగొట్టి ఎన్నికలు జరిపారు. జమ్మలమడుగులో కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్నా పట్టించుకోలేదు.

 

రెండు బూత్ లలో రీపోలింగ్..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్‌ జరుగుతోంది.  3, 14 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం (ఆగస్టు 12న) ఉప ఎన్నికలు నిర్వహించారు.  నిరసనల మధ్య పోలింగ్‌ జరిగింది. ఒంటిమిట్టలో 81.53 శాతం, పులివెందులలో 76.44 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు స్థానాల్లోనూ 11 మంది అభ్యర్థుల చొప్పున పోటీ చేశారు. పులివెందులలో టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget