అన్వేషించండి

YS Jagan: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వెబ్ కాస్టింగ్ ఫుటేజీ వైసీపీకి ఇచ్చే దమ్ముందా ? జగన్ ప్రశ్న

Jagan About Pulivendula ZPTC Election | ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా, ఇంత దారుణంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

Pulivendula ZPTC Election | తాడేపల్లి: ఏపీలో శాంతి భద్రతలు లేవు. ప్రజాస్వామ్యం అసలే లేదు అనడానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి బయటకు పంపించి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించిన వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్‌ ఫుటేజీని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. 15 పోలింగ్‌ బూత్‌లలో తమ పార్టీ ఏజెంట్లు లేకుండా చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఏపీలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు అన్నారు వైఎస్‌ జగన్‌. కేంద్ర బలగాల రక్షణలో ఈ ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పోలింగ్ బూత్‌లు మార్చడం ఏంటి..

ఏ ఊరిలో వాళ్లు అదే ఊరిలో ఓట్లు వేస్తారు. ప్రతి ఎన్నికల్లో అదే జరుగుతుంది. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లను మార్చారు. ఎర్రబల్లి, నల్లపురెడ్డిపల్లికి పోలింగ్ బూత్‌లు మార్చారని జగన్ ప్రదర్శించారు. ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లి ఓటు వేసి రావడం వింతగా ఉందన్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి ఇక్కడి నుంచే స్కెచ్ మొదలైంది. 4 వేల ఓట్ల పరిస్థితి ఇలా ఉంది. జనాల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయకుండా చేశారు. కొందర్ని బెదిరించి తమకు ఓటు వేసేలా చేశారు. 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోసం కాదు, వారిని బెదిరించడానికి పోలీసుల్ని తెచ్చారు. ఇతర జిల్లాల నుంచి మనుషుల్ని తెచ్చి పోలీసుల సమక్షంలో బూత్ కు 400 మందిని సెట్ చేశారు. 

కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు..

పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయటి నుంచి వచ్చిన టీడీపీ నేతలు, వారి మనుషులు ఏడు, ఎనిమిది వేల మంది వచ్చారు. ఒక్కో ఓటరుకు ఒక్కో రౌడీని ఏర్పాటు చేసిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎవరైనా అంటారా. మంత్రి సవిత, ఆదినారాయణ రెడ్డి మనుషులు, టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య మనుషులు ఈ కొత్తపల్లిలో మఖాం వేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటర్ కాదు. కానీ ఆయన కూడా కనంపల్లికి వచ్చి దౌర్జన్యం చేశారు. పోలింగ్ బూత్ ల నుంచి వైసీపీ ఏజెంట్లను వెళ్లగొట్టి ఎన్నికలు జరిపారు. జమ్మలమడుగులో కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్నా పట్టించుకోలేదు.

 

రెండు బూత్ లలో రీపోలింగ్..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్‌ జరుగుతోంది.  3, 14 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం (ఆగస్టు 12న) ఉప ఎన్నికలు నిర్వహించారు.  నిరసనల మధ్య పోలింగ్‌ జరిగింది. ఒంటిమిట్టలో 81.53 శాతం, పులివెందులలో 76.44 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు స్థానాల్లోనూ 11 మంది అభ్యర్థుల చొప్పున పోటీ చేశారు. పులివెందులలో టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget