అన్వేషించండి

Pulivendula ZPTC by-election: పులివెందులలో పోలీసులపై వైసీపీ నేతల ఆగ్రహం- నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్

Pulivendula Latest News: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికను తలపించింది. ఇక్కడ పోటీ టీడీపీతో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పోలీసులను టార్గెట్ చేశారు.

Pulivendula Latest News: జరిగేదే జడ్పీటీసీ ఎన్నిక. అది కూడా ఉపఎన్నిక. కానీ అది పులివెందుల. అందుకే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నంత హీట్‌ పుట్టిస్తోంది. వారం రోజుల నుంచి టీడీపీ, వైసీపీ మధ్య కవ్వింపు చర్యలు, కొట్లాటలు, విమర్శలు ప్రతి విమర్శలు సాగాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే పోలింగ్ రోజు జరిగిన సీన్స్‌ మరో ఎత్తు. అధికారంలో ఉన్న టీడీపీ పోలీసులను వాడుకొని రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. అసలు తమకు ప్రధాన ప్రత్యర్థులు ఖాకీలే అని ప్రకటించింది. అంతే కాదు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా పోలీసులు ఒక్కరు కూడా ఉద్యోగాల్లో ఉండరని పోస్ట్‌మ్యాన్ పనులు చేసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ నేతలు వర్సెస్‌ పోలీసులు పంచాయితీ తీవ్ర స్థాయికి చేరుకుంది. చాలా రోజుల నుంచి టీడీపీకి పోలీసులు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఐజీ కోయ ప్రవీణ్‌పై మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయన ఏకంగా టీడీపీ లీడర్ మాదిరిగానే ఉండి వైసీపీ నేతలను బెదిరిస్తన్నాని మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పులివెందులలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. పోలింగ్‌ రోజు అది మరింతగా పెరిగింది. పోటీ చేసిన టీడీపీ, వైసీపీ మధ్య ఉండాల్సిన పోరు ఇప్పుడు పోలీసుల వైపు టర్న్ అయింది. పోలీసులే ప్రత్యక్షంగా టీడీపీ విజయం కోసం పని చేస్తున్నారని వైసీపీ నేతల ఆరోపిస్తున్నారు. ఓటర్లను, వైసీప ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రానివ్వకుండా, టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకునేందుకు సహకరిస్తున్నారని మండిపడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత వాళ్ల సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

పులివెందులలో డీఎస్పీ మురళీనాయక్‌ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాగి వచ్చి రుబాబు చేస్తే కాల్చి పడేస్తానంటూ హెచ్చరించిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులకు తుపాకులు ఇచ్చింది జనాన్ని బెదిరించడానికా అని ప్రశ్నిస్తున్నారు. ఖాకీదుస్తులు ఉన్నాయని అహంకారంతో విర్రవీగితే నాలుగేళ్ల తర్వాత సినిమా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాల్చిపడేస్తానంటూ డీఎస్పీ చేసిన కామెంట్స్‌ను అవతలి వ్యక్తి కూడా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు చెప్పారని ఇప్పుడు రెచ్చిపోతే తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కర్నీ గుర్తు పెట్టుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు అతి చేస్తున్న ప్రతి పోలీసు కూడా నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాల్లో ఉండబోరని హెచ్చరించారు. కచ్చితంగా అలాంటి వారంతా పోస్టుమ్యాన్‌ల మాదిరిగా ఉండాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పులివెందులలో అరాచకం చేసిన టీడీపీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవబోదని అన్నారు.

మరో వీడియోలో కూడా పోలీసులపై విమర్శలు చేశారు రచమల్లు. ఇలాంటి పోలీసులను చూస్తుంటే సిగ్గేస్తోందని అన్నారు. 

పోలీసులు చేయాల్సిన డ్యామేజ్ చేశారని ఎవరూ గొడవలు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని ఎంపీ అవినాశ్‌ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. పోలీసులు, టిడిపి కార్యకర్తలు ఒక్కటేనని వారిపైనే భవిష్యత్‌లో పోరాటం చేయాలని న్యాయస్థానాల్లో వారిని దోషులుగా నిలబెడదామని అన్నారు.

పులివెందులలో పోలీసులు చేసిన పనికి భవిష్యత్‌లో ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారని అంజాద్ బాషా హెచ్చరించారు. ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి మరీ శిక్షిస్తామని అన్నారు. చాలా మంది పోలీసులు తమ లిస్ట్‌లో ఉన్నారని చెప్పారు.

మరో ప్రాంతంలో కూడా పోలీసులపై అంజాబ్‌ బాషా ఉగ్రరూపందాల్చారు. వేసుకున్న ఖాకీ దుస్తులకైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇలా పులివెందుల జడ్పీ ఎన్నిక పోలీసులు వర్సెస్‌ వైసీపీలా మారిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget