అన్వేషించండి

YS Jagan Chittoor Tour: కార్యకర్తని పరామర్శించేందుకు యత్నించిన జగన్, కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్న చిత్తూరు ఎస్పీ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది.

YSRCP Chief YS Jagan Mohan Reddy | బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగాళరుపాళ్యానికి వెళ్లారు. బంగారుపాళ్యం దగ్గర వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్ నుంచి దిగేందుకు యత్నించగా కారు దిగకుండా ఎస్పీ ఆయనను అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని, గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేయగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ తిరిగి కాన్వాయ్‍లో జగన్‍ను ఎక్కించి, అక్కడి నుంచి పంపించివేశారు. తరువాత బంగారుపాళ్యం మామిడి మార్కెట్ కు జగన్ చేరుకుని రైతులతో ముఖాముఖీ నిర్వహిస్తున్నారు. పండించిన మామిడి పంటకు ప్రభుత్వం ధర కల్పించడం లేదని, వారికి మద్దతుగా నిలిచేందుకు జగన్ ఇటీవల బంగారుపాళ్యం పర్యటన ఫిక్స్ చేసుకున్నారు.

పోలీసుల లాఠీచార్జ్ పై వైఎస్ జగన్ (YS Jagan) సీరియస్

చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్ లో యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు గాయమైందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గాయపడ్డ పార్టీ నేతను పరామర్శించడానికి అవకాశం ఇవ్వరా అంటూ మండిపడ్డారు. బంగారుపాళ్యంలో తనను కలిసేందుకు వచ్చిన ఓ అవ్వను మాజీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నావు అవ్వా అని అడిగారు. 


YS Jagan Chittoor Tour: కార్యకర్తని పరామర్శించేందుకు యత్నించిన జగన్, కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్న చిత్తూరు ఎస్పీ

భారీ సంఖ్యలో తరలివస్తున్న వైసీపీ కార్యకర్తలు

చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారుపాళ్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, రైతులు అక్కడికి తరలి వస్తున్నారు. జగన్ రావడానికి ముందే భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మార్కెట్ యార్డులోకి వెళ్లారు. అయితే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఉందని,  మార్కెట్ యార్డులో సైతం 500 మందికి తాము అనుమతి ఇచ్చామని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. ర్యాలీలు, రోడ్‌షోలు చేసినా, సభ లాంటివి నిర్వహించే ప్రయత్నం చేస్తే కనుక చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ (YSRCP) నేతల ఆరోపణ

తమను అడ్డుకోవడంతో మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, చిత్తూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ విజయానంద రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్లలో వెళ్లడానికి ఎలాగూ పర్మిషన్ లేదన్నారు. బైకు మీద కూడా వెళ్లకూడదా అని పోలీసులను విజయానంద్ ప్రశ్నించారు. ఎందుకు ఆపుతున్నారు అంటే, పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు. వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జగన్ కు మద్దతుగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ నుంచి వెళ్లిన వైఎస్ఆర్సిపి నాయకులను చిత్తూరు జిల్లా టిటిడిసి కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారని పార్టీ నేతలు ఆరోపించారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget