అన్వేషించండి

Uranium Digging: కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరపడం లేదు: కర్నూలు ఎస్పీ

Kurnool News | కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.

Kurnool District SP | దేవనకొండ: కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు జరుపుతున్నారన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరగడం లేదని, వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రజలకు సూచించారు. దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలలో యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోరు తవ్వకాలు జరగడం లేదని బుధవారం ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని,  సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.  

దామగుండం ఫారెస్టులో రాడార్ స్టేషన్
ఇటీవల తెలంగాణలో ఇలాంటి సమస్యే ఎదురైంది. వికారాబాద్ జిల్లాలోని దామగుండం అడవిలో భారత నౌకాదళం రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంది. అయితే రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే సమీపం ప్రాంతాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని, పర్యావరణం విషతుల్యం అవుతుందని ప్రజలు ఆందోళన చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్రానికి సహకరించడంతో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో రాడార్ స్టేషన్ కు ఇబ్బందులు తలెత్తలేదు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి అక్టోబర్ 15న రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. 

ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రజల్ని యురేనియం తవ్వకాల సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో 468.25 హెక్టార్లలో 68 బోర్లు వేసేందుకు అనుమతి ఇచ్చింది. యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణం దెబ్బతినడంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని   ఆందోళన వ్యక్తం చేశారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాల ప్రజలు ఇటీవల నిరసనకు దిగారు. కొన్ని గ్రామాల్లో అయితే ఇతర గ్రామాల నుంచి ఎవరూ తమ గ్రామంలోకి రాకుండా రోడ్డు మీద రాళ్లు, కంచెలు అడ్డుపెట్టి స్వీయ నిర్బంధం చేసుకున్నారు. 

Also Read: Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ - చర్చించిన అంశాలు ఇవే ! 

హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయం చేస్తున్నాయి. కానీ యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల కప్పట్రాళ్ల గ్రామాల ప్రజలు స్వీయ నిర్భంధం చేసుకుని రోడ్డుపై నిరసన తెలపగా, అధికారులు వచ్చి నవంబర్ 4న కలెక్టర్ వచ్చి మాట్లాడతారని చెప్పడంతో శాంతించారు. కప్పట్రాళ్ల, బేతపల్లి, గుండ్లకొండ, నెల్లిబండ,  నేలతలమరి, పి.కోటకొండ, చెల్లెలచెలిమల,  జిల్లేడు బుడకల, ఈదులదేవరబండ, బంటుపల్లి, మాదాపురం, దుప్పనగుర్తి గ్రామాల ప్రజలతో చెప్పిన ప్రకారం కలెక్టర్, ఉన్నతాధికారులు వెళ్లి వారితో చర్చించారు. యురేనియం కోసం బోర్లు వేయడం ద్వారా పర్యావరణం, నీరు దెబ్బతింటాయని స్థానికులు తీవ్ర అనారోగ్యం పాలవుతారని ఆందోళన చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget