అన్వేషించండి

Hindupuram Tension: హిందూపురంలో తల్లీకుమారుడి ఆత్మహత్యాయత్నం కేసులో మలుపు- పట్టా ఫేక్‌దే అంటున్న అధికారులు

హిందూపురం హీటెక్కింది. తల్లీ కుమారుడి ఆత్మహత్యాయత్నం కాకరేపుతోంది. అధికారులు, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అంతే ఘాటుగా స్పందిస్తున్నారు.

హిందూపురంలో తల్లీకుమారుడి ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త మలుపు తిరిగింది. స్థలం పట్టా వివాదంపై మున్సిపల్ కమిషనర్‌, తహసీల్దార్ స్పందించారు. శంకుంతలమ్మ పేరు మీద ఉన్న స్థలం పట్టా ఫేక్‌దని చెబుతున్నారు. నెంబర్ మార్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని అధికారుల వాదన. 

అధికార పార్టీ కౌన్సిలర్ గిరీష్ కుమార్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామన్నారు కమిషనర్‌. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్టు ఫిర్యాదు అందిందని ఆ కాపీని మీడియాకు చూపించారు కమిషనర్. ప్రభుత్వ స్థలాన్ని కాపడటమే తమ బాధ్యతన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఈ వివాదం కోర్టులో కూడా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని తమ మీదే ఆరోపణలు చేస్తే ఉద్యోగాలు చేయలేమంటున్నారు. 

అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి వేధిస్తున్నారని శంకుతల, ఆమె కుమారుడు నిన్న ఆత్మహత్యాయత్నం చేశారు. వాళ్లిద్దరు ఇప్పుడు బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై హిందూపురంలో హైటెక్షన్ వాతావరణం నెలకొంది. తల్లీకొడుకు ఆత్మహత్యయత్నానికి మున్సిపల్‌ కమిషనర్‌, వైసీపీ లీడర్లే కారణమంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, బీజేపీ లీడర్లు ర్యాలీ 
తీశారు. హిందూపురం మున్సిపల్ కార్యాలయ ముట్టడికి బయల్దేరారు. 

బీజేపీ లీడర్ల ర్యాలీ సంగతి తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. పెనుకొండ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం, ప్రధాన కూడళ్ల వద్ద బలగాలను పెట్టారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం చోటు చేసుకుంది. 

హిందూపురంలోని బోయవీదికి చెందిన శకుంతల ఆమె కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశఆరు. ఇంటి స్థలం పట్టా విషయంలో మున్సిఫల్ కమిషనర్‌, అధికార పార్టీ లీడర్లు వేధిస్తున్నారని ఆరోపించారు. 1992లో తమకు ప్రభుత్వం  పట్టా ఇచ్చిందని ఇప్పుడు దాన్ని ఫేక్ అంటూ వేధిస్తున్నారని శకుంతల కోడలు వాపోయారు. వారం రోజుల నుంచి నోటీసులు, కేసుల పేరుతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే అత్త, భర్త పురుగుల మందు తాగారంటున్నారు బాధితురాలు. దీనిపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారామె. తన అత్త, భర్తకు మెరుగైన వైద్యం అందించాలని కూడా వేడుకున్నారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget