యువతి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా వెంకటేశ్వర్లు ఓ మైనర్ను బెదిరించాడు. ఈ బెదిరింపుల కారణంగా మైనర్లు వెంకటేశ్వర్లును హత్య చేశారు.
Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయమై చంపుతానని బెదిరించాడనే కక్షతో వెంకటేశ్వర్లు అనే యువకుడిని ఇద్దరు మైనర్లు బైక్ రాడ్, రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. కడప జిల్లా మైదుకూరులో ఈ దారుణం జరిగింది.

- కడప జిల్లాలో యువతి విషయంలో గొడవతో యువకుడు హత్యకు గురయ్యాడు.
- స్నేహితురాలి విషయంలో బెదిరించాడని ఇద్దరు మైనర్లు హత్యకు ప్లాన్ చేశారు.
- బైక్ రాడ్డు, రాయితో కొట్టి హత్య చేయగా, మైనర్లను అరెస్టు చేశారు.
మైదుకూరు: యువతి విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఏకంగా ఓ యువకుడి హత్యకు దారి తీసింది. తనను చంపుతానని బెదిరించాడనే కోపంతో ఇద్దరు మైనర్లు కలిసి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం బోంచేనుపల్లె సమీపంలో ఘోరం జరిగింది. ఈ సంఘటన జులై 22న జరగ్గా, ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ కె.రమణారెడ్డి మంగళవారం వెల్లడించారు.
యువతి విషయంలో గొడవ.. బాలుడికి లవర్ వార్నింగ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోంచేనుపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు (19) అనే యువకుడు మైదుకూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో రిలేషన్లో ఉన్నాడు. వెంకటేశ్వర్లు ద్వారా అతడి స్నేహితుడైన ఓ మైనర్కు ఆ యువతి పరిచయమైంది. దాంతో ఆ బాలుడు కూడా ఆమెతో చనువుగా ఉండటం, తరచుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం నచ్చని వెంకటేశ్వర్లు, ఆ యువతితో ఇకపై మాట్లాడితే చంపేస్తానని స్నేహితుడైన మైనర్ యువకుడ్ని బెదిరించాడు.
వార్నింగ్ ఇచ్చాడని యువకుడి హత్యకు ప్లాన్
ఈ బెదిరింపులతో ఆందోళనకు గురైన ఆ బాలుడు తన పెద్దనాన్న కుమారుడికి (అతడు కూడా మైనరే) తెలిపాడు. వెంకటేశ్వర్లు తనకు ప్రమాదకరంగా మారాడని, హత్య చేస్తానని సైతం బెదిరించాడని సోదరుడితో చర్చించాడు. ఎప్పుడైనా వెంకటేశ్వర్లు నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించిన మైనర్, తన సోదరుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలో జులై 22న వెంకటేశ్వర్లును బోంచేనుపల్లె సమీపంలోని కాలనీ వద్దకు రావాలని ఆ బాలుడు పిలిచాడు. అతడు అలా వచ్చి రాగానే బైక్ రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో వెంకటేశ్వర్లు కింద పడిపోయి నొప్పితో గిలగిలా కొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు కోలుకునేందుకు సమయం ఇవ్వకుండా మైనర్ బాలురు ఇద్దరూ కలిసి పెద్ద రాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని కడపలోని బాలల న్యాయమండలి (జూవైనల్ బోర్డు) ముందు ప్రవేశపెట్టినట్లు సీఐ రమణారెడ్డి తెలిపారు.
Frequently Asked Questions
మైదుకూరులో యువకుడి హత్యకు ప్రధాన కారణం ఏమిటి?
హత్యకు గురైన యువకుడు ఎవరు?
హత్యకు గురైన యువకుడి పేరు వెంకటేశ్వర్లు (19). ఇతను బోంచేనుపల్లెకు చెందినవాడు.
ఈ హత్య ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
ఈ సంఘటన జులై 22న వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు మండలం బోంచేనుపల్లె సమీపంలో జరిగింది.
నిందితులు ఎవరు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఇద్దరు మైనర్లు ఈ హత్యకు పాల్పడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బాలల న్యాయమండలి ముందు ప్రవేశపెట్టారు.
ట్రెండింగ్ వార్తలు























