అన్వేషించండి

BJP On Dharmavaram: ధర్మవరం దాడి ఘటనపై బీజేపీ సీరియస్‌- కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని నిర్ణయం

ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని బీజేపీ సీరియస్‌గా తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

పట్టపగలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ ఖాతాల నుంచి డబ్బులు మాయమవడం చాలా ఆశ్చర్యం కలిగించిందని... ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగుల జిపియస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించిందని మాధవ్ ఆరోపించారు. పొరబాటున జరిగితే ఒకేసారి 80వేల ఖాతాల నుంచి ఎలా డ్రా అవుతాయని నిలదీశారు. 

విజయవాడలో పాత్రికేయ సమావేసాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ మాధవ్‌... వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత నవంబర్‌లో కూడా ఇదే మాదిరిగా జీపీఎస్ ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయని ఇప్పుడు కూడా మాయమయ్యాయన్నారు. జమ చేసిన డబ్బును మళ్లీ విత్‌డ్రా చేయడమంటే ఉద్యోగాలను మోసం చేయడమే అని అభిప్రాయపడ్డారు మాధవ్. 

డే లైట్ రోబరీకి ప్రభుత్వం పాల్పడిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ మాధవ్. చర్యలు తీసుకోవాల్సిన వాళ్లే చోరీలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారాయన. పిఆర్సీ‌, హెచ్.ఆర్.ఎ, అలెవెన్స్‌ల విషయంలో కూడా మోసం చేసిందన్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరిగిన తప్పును ఖండిస్తున్నామన్న మాధవ్... ప్రభుత్వం దుశ్యర్యకు పాల్పడిందని అందరికీ అర్థమైందన్నారు. పంచాయతీలకు చెందిన నిధులు ఇప్పటికే దారి మళ్లించారని... ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగానే ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేశారని ఆరోపించారు. అప్పుల కోసం ప్రభుత్వమే అడ్డదారుల్లో‌ వెళుతుందన్నారు. ఇలాంటి చర్యలను తప్పు పట్టిన ఉద్యోగులను సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా నల్లజెండాలు ఎగరేయాలన్న  వైసీపీ ఎమ్మెల్సీ కామెంట్స్‌ పార్టీ సమర్థిస్తుందో లేదో తేల్చాలన్నారు మాధవ్. ఈ తరహా వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. గతంలో తెలుగుదేశం ఇదేవిధంగా వ్యవహరిస్తే ప్రజలు అసహ్యించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

ధర్మవరం సంఘటనపై డిజపి ఫిర్యాదు చేశామన్నారు మాధవ్. ఈ ప్రభుత్వ హయాంలో యాభై మంది వరకు బిజెపి కార్యకర్తలు దాడికి‌ గురయ్యారన్నారు. ధర్మవరం విషయం చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనిపై కేంద్రం హోం శాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటువంటి దౌర్జన్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. 

 ఒకరోజు ముందే దాడి చేస్తామని చెప్పి విచక్షణారహితంగా బిజెపి కార్యకర్తలను కొట్టడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా పాలేగాళ్ళ రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో బిజెపి కార్యకర్తల పై జరిగిన దాడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పై కేసు నమోదు చేయాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ను సూర్యనారాయణ కలిశారు. 

ముందు రోజు జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి దాడులు చేస్తామని చెప్పి మరుసటిరోజే తన అనుచరులను పంపించి దాడి చేయించారన్నారు. ఏదైనా సమస్య ఉంటే తనతో చూసుకోవాలి కానీ రెచ్చగొట్టి దాడులు చేయించడం అమాయకులను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తామని ప్రజలు కూడా హర్షిస్తారు అన్నారు. అంతేకానీ దౌర్జన్యాలు భూకబ్జాలు చేస్తే తిరుగుబాటు తప్పదన్న విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డిని హెచ్చరించారు. తాడి ఘటనకు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని తొందర్లోనే వాళ్లు కూడా ఇక్కడికి వస్తారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Embed widget