అన్వేషించండి

BJP On Dharmavaram: ధర్మవరం దాడి ఘటనపై బీజేపీ సీరియస్‌- కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని నిర్ణయం

ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని బీజేపీ సీరియస్‌గా తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

పట్టపగలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ ఖాతాల నుంచి డబ్బులు మాయమవడం చాలా ఆశ్చర్యం కలిగించిందని... ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగుల జిపియస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించిందని మాధవ్ ఆరోపించారు. పొరబాటున జరిగితే ఒకేసారి 80వేల ఖాతాల నుంచి ఎలా డ్రా అవుతాయని నిలదీశారు. 

విజయవాడలో పాత్రికేయ సమావేసాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ మాధవ్‌... వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత నవంబర్‌లో కూడా ఇదే మాదిరిగా జీపీఎస్ ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయని ఇప్పుడు కూడా మాయమయ్యాయన్నారు. జమ చేసిన డబ్బును మళ్లీ విత్‌డ్రా చేయడమంటే ఉద్యోగాలను మోసం చేయడమే అని అభిప్రాయపడ్డారు మాధవ్. 

డే లైట్ రోబరీకి ప్రభుత్వం పాల్పడిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ మాధవ్. చర్యలు తీసుకోవాల్సిన వాళ్లే చోరీలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారాయన. పిఆర్సీ‌, హెచ్.ఆర్.ఎ, అలెవెన్స్‌ల విషయంలో కూడా మోసం చేసిందన్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరిగిన తప్పును ఖండిస్తున్నామన్న మాధవ్... ప్రభుత్వం దుశ్యర్యకు పాల్పడిందని అందరికీ అర్థమైందన్నారు. పంచాయతీలకు చెందిన నిధులు ఇప్పటికే దారి మళ్లించారని... ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగానే ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేశారని ఆరోపించారు. అప్పుల కోసం ప్రభుత్వమే అడ్డదారుల్లో‌ వెళుతుందన్నారు. ఇలాంటి చర్యలను తప్పు పట్టిన ఉద్యోగులను సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా నల్లజెండాలు ఎగరేయాలన్న  వైసీపీ ఎమ్మెల్సీ కామెంట్స్‌ పార్టీ సమర్థిస్తుందో లేదో తేల్చాలన్నారు మాధవ్. ఈ తరహా వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. గతంలో తెలుగుదేశం ఇదేవిధంగా వ్యవహరిస్తే ప్రజలు అసహ్యించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

ధర్మవరం సంఘటనపై డిజపి ఫిర్యాదు చేశామన్నారు మాధవ్. ఈ ప్రభుత్వ హయాంలో యాభై మంది వరకు బిజెపి కార్యకర్తలు దాడికి‌ గురయ్యారన్నారు. ధర్మవరం విషయం చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనిపై కేంద్రం హోం శాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటువంటి దౌర్జన్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. 

 ఒకరోజు ముందే దాడి చేస్తామని చెప్పి విచక్షణారహితంగా బిజెపి కార్యకర్తలను కొట్టడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా పాలేగాళ్ళ రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో బిజెపి కార్యకర్తల పై జరిగిన దాడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పై కేసు నమోదు చేయాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ను సూర్యనారాయణ కలిశారు. 

ముందు రోజు జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి దాడులు చేస్తామని చెప్పి మరుసటిరోజే తన అనుచరులను పంపించి దాడి చేయించారన్నారు. ఏదైనా సమస్య ఉంటే తనతో చూసుకోవాలి కానీ రెచ్చగొట్టి దాడులు చేయించడం అమాయకులను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తామని ప్రజలు కూడా హర్షిస్తారు అన్నారు. అంతేకానీ దౌర్జన్యాలు భూకబ్జాలు చేస్తే తిరుగుబాటు తప్పదన్న విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డిని హెచ్చరించారు. తాడి ఘటనకు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని తొందర్లోనే వాళ్లు కూడా ఇక్కడికి వస్తారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Union Cabinet Decisions: 7 రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లేన్లు ఇవే
7 రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లేన్లు ఇవే
Kadapa News: లోయలోకి దూసుకెళ్లిన లారీ, మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం- కడపలో ఘటన
లోయలోకి దూసుకెళ్లిన లారీ, మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం- కడపలో ఘటన

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget