అన్వేషించండి

Kesineni : కేశినేని నోట ఇండిపెండెంట్‌గా పోటీ మాట - టీడీపీ టిక్కెట్ ఇవ్వదని డిసైడయ్యారా ?

ఇండిపెండెంట్ గా అయినా పోటీకి సిద్ధమేనని కేశినేని నాని ప్రకటించారు. టీడీపీ ఏ పిట్టలదొరకు టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు.


Kesineni :   విజయవాడ ఎంపీ కేశినేని నాని అవసరం అయితే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా ఏ పిట్టల దొరకు తెలుగుదేశం పార్టీ తరపున టిక్కెట్టు ఇచ్చినా తనకు ఇబ్బంది లేదని  సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందా? తాను ఎంపీ అవుతానా? అనే భయం తనకు లేదన్నారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని కేశినేని నాని తేల్చి చెప్పారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకన్నా తనకు భయం లేదన్నారు. తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని కేశినేని నాని చెప్పారు. తాను చేసిననన్ని పనులు దేశంలో ఏ ఎంపీ కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు.ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమోనని నాని వ్యాఖ్యానించారు. 

వైసీపీలోకి కేశినేని నాని వస్తానంటే స్వాగతిస్తామని వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి మీడియాతో వ్యాఖ్యలు చేసిన రోజే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వైసీపీ నేతలు కొందరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలో రెండు ఫ్లాట్‌ ఫామ్స్ ఉన్నాయని..అది జగన్, చంద్రబాబు అని కేశినేని నాని చెబుతున్నారు. ఏదైనా వైరం ఉంటే వారి మధ్యే ఉన్నాయని..  నేతల మధ్య లేవన్నారు. అభివృద్ధి పనుల కోసం ఇతర పార్టీల నేతల్ని కలిస్తే తప్పు లేదన్నారు. ఇటీవల కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 
 
2019 ఎన్నికల తర్వాత అవకావశం దొరికినప్పుడల్లా టీడీపీ పై నాని విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీలో తనకు కట్టబెట్టిన పదవులు కూడా వద్దని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నానికి ఇతర నేతలకు మధ్య ఉన్న విబేధాలు మరింత బహిర్గతమయ్యాయి. తన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఏకపక్షంగా ప్రకటించుకుని.. తానే గెలిపించుకుంటానని ప్రచారం చేశారు. అయితే ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.                              

 విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇతర టీడీపీ నేతలతో కూడ నానికి మధ్య గ్యాప్ పెరిగింది..ఈ నేప‌థ్యంలో నానీ సోద‌రుడు చిన్నా యాక్టీవ్ అయ్యారు.. టిడిపి కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గాపాల్గొంటూ అధిష్టానానికి ద‌గ్గ‌ర‌య్యారు.. విజ‌య‌వాడ లోక్ స‌భ సీటును చిన్నా ఆశిస్తున్నారు. సోదరుడితో కేశినేని నానికి సంబంధాలు చెడిపోయాయి. గతంలో ఎన్నికల్లో విజయం కోసం నాని కోసం చిన్ని పని చేసినప్పటికీ.. తర్వాత సొంతంగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలి కాలంలో  టిక్కెట్ల కసరత్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి ఎంపీగా కేశినేనిని పరిగణనలోకి తీసుకోవడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేశినేని నాని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటున్నారు.                            

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Embed widget