అన్వేషించండి

Janasena: జనసేన ఒంటరి పోరు.. నెల్లూరు నుంచే మొదలు..

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బీజేపీ-జనసేన నేతల నుంచి ఎలాంటి స్పందన లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎవరి గుర్తుపై వారు పోటీ చేసినా ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకున్నారు. కానీ ఇప్పుడా త్యాగాలకు టైమ్ దగ్గరపడినట్టు కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారం కోర్టులో ఉండటంతో  నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇప్పుడా కేసు ఓ కొలిక్కి రావడంతో కార్పొరేషన్లో ఎన్నికల హంగామా మొదలైంది. అయితే ఇక్కడ జనసేన-బీజేపీ కూటమి కలసి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. 

నెల్లూరు నగర కార్పొరేషన్లోని 54 డివిజన్లలో జనసేన తన అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఔత్సాహికుల వద్ద దరఖాస్తులు స్వీకరించారు. కొంతమందికి టికెట్లు ఖరారు చేయడంతో వారు ప్రచార పర్వంలోకి కూడా దిగేశారు. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి.. అభ్యర్థులను ప్రచార రంగంలోకి దింపారు. మొత్తం 54 డివిజన్లలో జనసేన పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. 
జనసేన 54 డివిజన్లలో పోటీ చేస్తే మరి బీజేపీ సంగతేంటి.. ఆ విషయంపై మాత్రం జనసేన వర్గాలు సైలెంట్ గా ఉంటున్నాయి. మరోవైపు బీజేపీ కూడా జనసేన నిర్ణయంతో షాకైంది. ప్రస్తుతం బద్వేల్ హడావుడిలో ఉన్నామని, ఆ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టిపెడతామని అంటున్నారు బీజేపీ నేతలు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బోణీ కొట్టిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. నెల్లూరు జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండు సర్పంచ్ స్థానాలను జనసేన కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాలు కూడా జనసేన ఖాతాలో పడ్డాయి. జనసేనకు వచ్చిన ఓట్లతో పోల్చి చూస్తే బీజేపీకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో సహజంగానే జనసేన నాయకులు సొంతంగా బరిలో దిగి తమ సత్తా చూపించాలని అనుకుంటున్నారు. పొత్తులతో ఇప్పటికే చాలా నష్టపోయామనే భావన వారిలో ఉంది. దీనికి తోడు అధిష్టానం కూడా ఒంటరిపోరుకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నెల్లూరు కార్పొరేషన్లో జనసేన అన్ని డివిజన్లలోనూ అభ్యర్థుల్ని బరిలో దింపుతోంది.

Also Read: Jagan Illegal Assets Case: సీఎం జగన్ అక్రమాస్తుల పెండింగ్ కేసులపై రోజు వారీ విచారణ

Also Read: Sajjala : కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు.. విడిపోతే ఏపీ చీకట్లోకి వెళ్లిపోతుందని చెప్పామన్న సజ్జల !

Also Read:   Cyberabad Police: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..

Also Read:  Cyberabad traffic police: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడి నుంచి చూస్తున్నారయ్యా?!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget