అన్వేషించండి

Sajjala : కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు.. విడిపోతే ఏపీ చీకట్లోకి వెళ్లిపోతుందని చెప్పామన్న సజ్జల !

ప్రజలు అజడిగినా, అడగకపోయినా ఏపీలో టీఆర్ఎస్ పెట్టుకోవచ్చని కేసీఆర్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారు. దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని కొన్ని వేల మంది విజ్ఞప్తి చేస్తున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కేసీఆర్‌కు లెక్కలేనన్ని విజ్ఞాపనలు వస్తే పార్టీ పెట్టుకోవచ్చని సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజలు అడిగినా పార్టీ పెట్టొచ్చు.. అడక్కపోయినా పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందని అన్నారని.. కానీ ఇప్పుడు ఏపీలో చీకట్లు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఏనాడూ వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ అంధకారం అనలేదని కానీ .. విడిపోతే ఆంధ్రా అంధకారం అవుతుందని చెప్పామని గుర్తు చేశారు. 

Also Read : చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ ! కేంద్ర బలగాల రక్షణ కోరిన టీడీపీ అధినేత !

ప్లీనరీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కేసీఆర్ చేసిన విమర్శలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇవ్వలేదు. వీలైనంత సాఫ్ట్‌గా స్పందించే ప్రయత్నం చేశారు. ఏపీలో చీకట్లు ఉన్నాయని.. విద్యుత్ కోతలు అమలవుతున్నాయని విపక్ష నేతలు విమర్శలు చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గతంలో ఖండించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అదే తరహా ప్రకటన చేస్తే ఖండించలేదు. రాజకీయంగానే సమాధానం చెప్పారు. విడిపోవడం వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పారు. 

Also Read : ధూళిపాళ్ల ట్రస్ట్‌ స్వాధీనం దిశగా ప్రభుత్వం ! వారం రోజుల తర్వాత కీలక పరిణామాలు..?

పథకాల అంశంలో పెద్దగా స్పందించలేదు. తెలంగాణతో పోలిస్తే తామే పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేసీఆర్ ప్రకటనపై స్పందించారు. ఆ తర్వాత ఇంకెవరూ స్పందించలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అనవసరంగా ఎవరూ స్పందించి భారీ ప్రాధాన్యత కల్పించవద్దని ముందుగానే వైసీపీ హైకమాండ్ తమ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. 

Also Read : ఏపీ నార్కొటిక్స్ హబ్ గా మారింది.. నల్గొండ ఎస్పీ కూడా అదే చెప్పారు

గత ఎన్నికలకు ముందు నుంచీ టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు పార్టీల ఎంపీలు కలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చని.. ఏపీ, తెలంగాణలకు కావాల్సిన నిధులు రాబట్టుకోవచ్చని గతంలో చెప్పారు. అయిత ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు కలిసి రాలేదు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తూండటం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. 

Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్: HMWSSB
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Anasuya Bharadwaj: నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!
నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్: HMWSSB
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Anasuya Bharadwaj: నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!
నిండుగా చీర కట్టిన అనసూయ... శివాజీ కామెంట్స్ తర్వాత!
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Tata Punch EV: అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని సొంతం
అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
Embed widget