అన్వేషించండి

Sajjala : కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు.. విడిపోతే ఏపీ చీకట్లోకి వెళ్లిపోతుందని చెప్పామన్న సజ్జల !

ప్రజలు అజడిగినా, అడగకపోయినా ఏపీలో టీఆర్ఎస్ పెట్టుకోవచ్చని కేసీఆర్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారు. దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని కొన్ని వేల మంది విజ్ఞప్తి చేస్తున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కేసీఆర్‌కు లెక్కలేనన్ని విజ్ఞాపనలు వస్తే పార్టీ పెట్టుకోవచ్చని సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజలు అడిగినా పార్టీ పెట్టొచ్చు.. అడక్కపోయినా పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందని అన్నారని.. కానీ ఇప్పుడు ఏపీలో చీకట్లు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఏనాడూ వైఎస్ఆర్‌సీపీ తెలంగాణ అంధకారం అనలేదని కానీ .. విడిపోతే ఆంధ్రా అంధకారం అవుతుందని చెప్పామని గుర్తు చేశారు. 

Also Read : చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ ! కేంద్ర బలగాల రక్షణ కోరిన టీడీపీ అధినేత !

ప్లీనరీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కేసీఆర్ చేసిన విమర్శలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇవ్వలేదు. వీలైనంత సాఫ్ట్‌గా స్పందించే ప్రయత్నం చేశారు. ఏపీలో చీకట్లు ఉన్నాయని.. విద్యుత్ కోతలు అమలవుతున్నాయని విపక్ష నేతలు విమర్శలు చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గతంలో ఖండించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అదే తరహా ప్రకటన చేస్తే ఖండించలేదు. రాజకీయంగానే సమాధానం చెప్పారు. విడిపోవడం వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పారు. 

Also Read : ధూళిపాళ్ల ట్రస్ట్‌ స్వాధీనం దిశగా ప్రభుత్వం ! వారం రోజుల తర్వాత కీలక పరిణామాలు..?

పథకాల అంశంలో పెద్దగా స్పందించలేదు. తెలంగాణతో పోలిస్తే తామే పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేసీఆర్ ప్రకటనపై స్పందించారు. ఆ తర్వాత ఇంకెవరూ స్పందించలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అనవసరంగా ఎవరూ స్పందించి భారీ ప్రాధాన్యత కల్పించవద్దని ముందుగానే వైసీపీ హైకమాండ్ తమ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. 

Also Read : ఏపీ నార్కొటిక్స్ హబ్ గా మారింది.. నల్గొండ ఎస్పీ కూడా అదే చెప్పారు

గత ఎన్నికలకు ముందు నుంచీ టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు పార్టీల ఎంపీలు కలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చని.. ఏపీ, తెలంగాణలకు కావాల్సిన నిధులు రాబట్టుకోవచ్చని గతంలో చెప్పారు. అయిత ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు కలిసి రాలేదు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తూండటం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. 

Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget