అన్వేషించండి

Dhulipalla : ధూళిపాళ్ల ట్రస్ట్‌ స్వాధీనం దిశగా ప్రభుత్వం ! వారం రోజుల తర్వాత కీలక పరిణామాలు..?

ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా ఉన్న డీవీసీ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారంలో చెప్పాలని నోటీసులు జారీ చేసింది.

 

తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుంచి నోటీసులు అందాయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఉంది. సంతృప్తికర సమాధానం ఇవ్వకపోయినా.. నోటీసులకు సమాధానం ఇవ్వకపోయినా ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సహకార చట్టంలోని 6 A కింద .. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌ లాల్ ఈ నోటీసులను జారీ చేశారు.

Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !

అయితే ధూళిపాళ్ల ట్రస్ట్‌కు దేవాదాయశాఖ తరపున నోటీసులు జారీ కావడం ఇదే మొదటి సారి కాదు. ఆగస్టు 19వ తేదీన కూడా ఓ సారి నోటీసులు జారీ చేశారు. అప్పట్లో దేవదాయ శాఖ జేసీ,  శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. అయితే అప్పట్లో ఆ నోటీసును చేతికి కూడా అందించకుండా ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆస్పత్రి గోడపై అతికించి వెళ్లారు. ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టీల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ నోటీసుల్లో పేర్కొంది.  ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయము, ఖర్చులకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది.

Also Read : గంజాయి ఏపీకి కొత్త కాదు... డ్రగ్స్ వ్యవహరంలో రాజకీయం వద్దు... డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు

ఆ నోటీసులకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న నరేంద్ర స్పందించారో లేదో స్పష్టత లేదు. రెండు నెలల తర్వాత ఇప్పుడు  దేవాదాయ శాఖ కమిషనర్ పేరు మీదనే నోటీసులు జారీ అయ్యాయి.  సంగం డెయిరీ ప్రాంగణంలోనే డీవీసీ ట్రస్ట్ ఉంది. 1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా పదెకరాల స్థలంలో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి. రైతులకు, సంగం డెయిరీ ఉద్యోగులకు సేవలు అందించేందుకు నిర్మించారు. సంగం డెయిరీ రైతుల కోసం మరిన్ని కార్యక్రమాలను ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. 

Also read: విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు... పారదర్శకంగా నియామకాలు చేపట్టండి... ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష

గతంలో సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసింది. కానీ ఆ  ఉత్తర‌్వులు హైకోర్టులో నిలువలేదు. అప్పుడు కూడా ప్రధానంగా ప్రభుత్వం ఈ ట్రస్ట్‌పైనే ఆరోపణలు చేసింది. డీవీసీ ట్రస్ట్ పేరుతో కట్టిన ఆస్పత్రి ఉన్న పది ఎకరాలు సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన స్థలం అని.. దాన్ని అలా ట్రస్ట్‌కు తీసుకోవడం చట్ట విరుద్ధమన్న కారణాన్ని  సంగం డెయిరీ స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ ట్రస్ట్ విషయంలో దేవాదాయశాఖకు సంబంధం ఏమిటన్నదానికి మిస్టరీగా మారింది.

Also Read: మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


   

టాప్ హెడ్ లైన్స్

President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Nara Lokesh Speech Tribal University Convocation: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Pawan Kalyan Meets Devendra Fadnavis : రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget