అన్వేషించండి

Amit Shah To Chandra Babu : చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ ! కేంద్ర బలగాల రక్షణ కోరిన టీడీపీ అధినేత !

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కశ్మీర్‌లో ఉన్న కారణంగా అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో చంద్రబాబు వెనక్కి వచ్చేశారు. విషయం తెలిసి అమిత్ షా ఫోన్ చేశారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను వివరించి.. ఆర్టికల్ 356 విధించాలని విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాష్ట్రపతిని కలిశారు.  కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేద్దామనుకున్నారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే అమిత్ షా కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఈ కారణంగా అపాయింట్‌మెంట్ లభించలేదు. దాంతో చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. 

Also Read : ధూళిపాళ్ల ట్రస్ట్‌ స్వాధీనం దిశగా ప్రభుత్వం ! వారం రోజుల తర్వాత కీలక పరిణామాలు..?

చంద్రబాబునాయుడు తన అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారని తెలిసిన తర్వాత అమిత్ షా ఫోన్ చేసినట్లుగా  భావిస్తున్నారు.  ఫోన్‌లోనే ఏపీ పరిస్థితులను అమిత్ షా వివరించినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు,  నేతల ఇళ్లపై జరిగిన దాడులు..  ఆ దాడుల్లో పోలీసులు స్వయంగా పాల్గొనడం, పైగా నిందితుల్లో ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం, తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడం వంటి అంశాలను వివరించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో డ్రగ్స్, గంజాయికి కేంద్రంగా ఏపీ మారిన వైనాన్ని కూడా వివరించారు. తక్షణం ఏపీలో ఆర్టికల్ 356 విధించడానికి అనువైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని తెలిపారు. 

Also Read : ఏపీ నార్కొటిక్స్ హబ్ గా మారింది.. నల్గొండ ఎస్పీ కూడా అదే చెప్పారు

ఏపీలో పోలీసులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేతలే టార్గెట్‌గా పని చేస్తున్నందున కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. పరిశీలిస్తామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడంతో టీడీపీలో కాస్త నిరాశ కనిపించింది. అయితే అమిత్ షానే నేరుగా ఫోన్ చేయడంతో ఆ పార్టీ నేతలు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. 

Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !

మరో వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎవరూ ఢిల్లీలో అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీకి వచ్చింది వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికని ఆరోపించారు. తాము కూడా ఈసీని, రాష్ట్రపతిని కలిసి తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబును ఉగ్రవాది అని అనడంలో ఏ మాత్రం తప్పు లేదని విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఘాటు విమర్శలు చేశారు. 

Also Read : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget