అన్వేషించండి

Jagan Back to Tadepalli : తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్ - ఓటమిపై సమీక్షలు ప్రారంభించే అవకాశం

YSRCP : బెంగళూరు పర్యటన నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటికి చేరుకున్నారు. ఓటమిపై ఆయన ముఖ్య నేతలతో సమీక్షలు ప్రారంభించే అవకాశం ఉంది.

Jaganmohan Reddy  :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి  బెంగళూరు నుంచి తాడపల్లి నివాసానికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్ లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారంతా సీఎం సీఎం అనే నినాదాలు చేశారు. జగన్ వారినందర్నీ పలకరిస్తూ వెళ్లారు. కొంత మంది కార్యకర్తల దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లారు. 

ఎన్నికల్లో ఓటమి తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ తాడేపల్లి నివాసంలో ఉన్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికలో కూడా పాల్గొనకుండా పులివెందుల పర్యటనకు వెళ్లారు. అక్కడ మూడు రోజులుగా ఉన్న తర్వాత  బెంగళూరు వెళ్లారు.  కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఆయన తిరిగి తాడేపల్లికి వచ్చారు. ఇక నుంచి పార్ట ీఓటమిపై ఆయన సమీక్షలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈవీఎంలను నిందిస్తూ కూర్చుకోవడం కన్నా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం మంచిదని భావిస్తున్నారు.                          

 

కొంత మంది సీనియర్ నేతలతో జగన్ ఇప్పటికే సమావేశం అయ్యారు. అయితే అవన్నీ క్యాజువల్ మీటింగ్స్. ఓటమికి కారణాలు తేల్చే సమావేశాలను ఇంకా  పెట్టలేదు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా లేదా జిల్లాల వారీగా సమవేశాలు పెట్టాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో  జరిగిన అవినీతి, అక్రమ కేసులు, దాడులు వంటి ఘటనలన్నింటినీ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది నేతలు ఆజ్ఞాతంలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు జగన్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన ఘటనల్లో బాధితుల్ని పరామర్శిస్తానని అందరికీ అండగా ఉంటానని ప్రకటించారు.                               

వైసీపీ ఓడిపోయిందని చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం .. మనస్తాపంతో గుండెపోటుకు గురవడం వంటి ఘటనల్లో పెద్ద ఎత్తున జనం చనిపోయారని వారందరికీ ఓదార్పునిచ్చేలా యాత్ర చేస్తానని జగన్ ఇప్పటికే చెప్పారు. డిసెంబర్ లేదా జనవరి నుంచి యాత్ర ప్రారంభమవుతుందని జగన్ చెప్పారు. ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు చేయబోమని .. తాము సమయం ఇస్తామని .. ఆరు నెలల తర్వాత హామీల అమలును చూసి ఉద్యమిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.                       

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget