అన్వేషించండి

Jagananna Suraksha: రికార్డులను బ్రేక్ చేసిన జగనన్న సురక్ష, ఒక్కరోజే  7.54 లక్షల వినతులకు పరిష్కారం

AP CM YS Jagan Mohan Reddy: జగనన్న సురక్ష రికార్డులను బ్రేక్ చేసింది. వరుసగా నెల రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

AP CM YS Jagan Mohan Reddy: జగనన్న సురక్ష రికార్డులను బ్రేక్ చేసింది. వరుసగా నెల రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

జగనన్న సురక్ష 30 రోజుల్లో జరిగిందేంటంటే...
31 రోజుల్లో 15,004 సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి, 2.68 లక్షల క్లస్టర్లలో 1.42 కోట్ల ఇళ్లను సందర్శించిన వాలంటీర్లు స్దానిక ప్రజల నుండి 93.36 లక్షల వినతులను స్వీకరించి వాటికి, పరిష్కారం చూపించారు. అయితే  జూలై 18వ తేదీ ఒక్కరోజే  7.54 లక్షల వినతులను తీసుకొని వాటికి పరిష్కారం కూడా చూపించటం మరొక రికార్డుగా ప్రభుత్వం ప్రకటించింది. 
‘జగనన్న సురక్ష’ కార్యక్రమం రాష్ట్రంలో సంచలనంగా మారినట్లుగా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న ప్రదాన లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్షా’ కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల జరుగుతుండగా రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సురక్షా శిబిరాల్లోనే వివిధ ధ్రువీకరణ పత్రాలను కూడా మంజూరు చేయించారు.  

వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ ఛార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందించి వారిలో సంతోషం చూడాలని జగన్ సర్కార్ పట్టుదలతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి విశేషమైన వచ్చింది.  మొదటిరోజు మొత్తం 1305 చివాలయాల పరిధిలో 4,73,930 వినతులు వస్తే వాటిల్లో ప్రభుత్వం అక్కడిక్కడే పరిష్కరించిన అర్జీల సంఖ్య 4,57,642 కావటం విశేసం. 31వ తేదీ నాటికి మొత్తం 15,004 సచివాలయాల పరిధిలో ఉన్న 1.42 కోట్ల కుటుంబాల నుంచి 95.96 లక్షల వినతులు వస్తే 93.36 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయని ప్రభుత్వం లెక్కలు ద్వారా వెల్లడించింది.

వాలంటీర్లే కీలకం..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  2.68 లక్షల మంది వాలంటీర్లు జగనన్న సురక్షా శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 1.42 కోట్ల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 7,65,722 అభ్యర్థనలు వచ్చాయి. అందులో  7,62,655 అర్జీలను అధికారులు పరిష్కరించారు.  అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 1,27,474 అభ్యర్థనలు వచ్చాయి, అందులో  1,22,300 అర్జీలు పరిష్కారం అయినట్లు అధికారులు వెల్లడించారు.  ఇప్పటి దాక 45,33,654 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 41,50,275 ఆదాయ ధృవీకరణ పత్రాలు, 7,326 ఓబీసి సర్టిఫికెట్లు, 2,366 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 16,373 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 1,40,114 అడంగల్ సర్టిఫికెట్లు, 2,70,194 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశామని ఇవన్నీ వాలంటీర్ల చేతులు మీదగానే జరగటం మంచి పరిణామంగా ప్రభుత్వం భావిస్తోంది..

ఇక ఆరోగ్య శ్రీ కార్డులు 6,511, కొత్త బియ్యం కార్డులు 15,081, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు  89,102 అర్జీలు , ఆధార్ తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 2,72,305 ఉన్నాయి. అలాగే పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 4,631 ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని జగనన్న ప్రభుత్వంలో అధికారులతో ఏ పనీ ఉన్నా సులభంగా పూర్తవుతున్నాయనే అభిప్రాయాన్నిక్రియేట్ చేసేందుకు, సర్కార్ తీసుకున్న చర్యలు ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. అర్హత ఉండి కూడా పథకాలు అందకపోతే వెంటనే స్థానికంగా ఉన్న వాలంటీరును కానీ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వ సేవలు అందుతాయని వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
Online Betting Racket: రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
AP PMAY Gramin 2.0: పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Embed widget