అన్వేషించండి

YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు

Andhra Pradeh: పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొొచ్చి శిక్షిస్తామన్నారు.

Jagan issued warnings to the police officers: వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేయకుండా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు పేరు చెప్పి మరీ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఎండీ, చైర్మన్ గా మంచి పదవి ఇచ్చామన్నారు.  అయినా ఇప్పుడు డీజీపీ పదవి కోసం దిగజారిపోయారని ఆరోపించారు. ఇప్పుడు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రిటైరైపోతారని అనుకుంటున్నారేమో కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకు వచ్చి శిక్షిస్తామన్నారు. 

తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరును  ప్రస్తావించి జగన్ వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ నుంచి వచ్చారని .. డిప్యూటేషన్ అయిపోయాక తెలంగాణకు వెళ్లిపోయినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని జగన్ పోలీసులకు గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని తర్వాత తామే వస్తామని హెచ్చరించారు. చట్టం మీరి ప్రవర్తించిన ప్రతి పోలీసు అధికారులను తీసుకు వచ్చి చట్టం కింద నిలబడతామన్నారు. అలాగే ఇప్పుడు ప్రైవేటు కేసులు కూడా దాఖలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన సోషల్ మీడియా కార్యకర్తల పేర్లను కొన్నింటిని జగన్ చదివారు. హైదరాబాద్ .. నల్లగొండ నుంచి కూడా కొంత మందిని అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.             

మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్

ఏడేళ్లలోపు కేసుల్లో ప్రొసీజర్లు ఉన్నాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. నిజంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉంటే.. వారెంట్‌ ఇవ్వాలి.  41ఏ కింద నోటీసులు ఇవ్వాలి. మెజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్‌. కానీ, ఇవేవీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అరెస్టు చేస్తున్న వారందరూ యంగ్ స్టర్స్ అని జగన్ అన్నారు.  

సరస్వతి పవర్ భూముల విషయంపైనా జగన్ స్పందించారు. ఆ భూములను రైతులకు రెట్టింపు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానన్నారు. కొనుగోలు చేసినప్పుడు గ్రామసభలు పెడితే రైతులు ఎకరానికి లక్షా 70వేల రూపాయలు అడిగారని .. తాను మూడు లక్షలు ఇచ్చానని.. అదీ జగన్ అంటే అని ఆయన చెప్పుకు వచ్చారు. సిమెంట్ పరిశ్రమకు నీరు, గనులు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. పరిశ్రమలు రాకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు.        

'మీరు కుర్చీ లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు' - కడప మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం

జగన్ అనే వ్యక్తి చాలా మంచి వాడని రైతుల్ని సంంతోషంగా ఉంచేందుకు అడిగిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చామన్నారు. అక్కడ సర్వే చేసిన అధికారులు కూడా ఎలాంటి ఉల్లంఘనలులేవని  సర్టిఫికెట్ ఇచ్చారని ఎమ్మార్వో బైట్ ను జగన్ మీడియాకు ప్రదర్శించారు.   
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget