అన్వేషించండి

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన - వైఎస్ జగన్, రఘురామ మధ్య సంభాషణ, ఏం మాట్లాడుకున్నారంటే?

Andhrapradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. వీరిద్దరూ ఏదో మాట్లాడుకోగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Conversation Between YS Jagan And Raghurama: ఏపీ అసెంబ్లీలో (Ap Assembly) సోమవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ (వైఎస్ జగన్), టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రఘురామ.. జగన్ వద్దకు వెళ్లి పలకరించారు. అనంతరం ఏదో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ సభకు రావాలని జగన్‌ను కోరగా.. హాజరవుతానని జగన్ బదులిచ్చినట్లు రఘురామ చెప్పారు. వారిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, గతంలో వైసీపీ ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు, జగన్ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో రఘురామను అరెస్ట్ కూడా చేశారు. అయినా, ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. గత ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. తాజాగా, వైఎస్ జగన్ సహా కొందరు అధికారులపైనా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జగన్‌, అధికారులపై కేసు కూడా నమోదైంది.

అసెంబ్లీలో హైలెట్స్ ఇవే..

కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వైసీపీ నేతల ఉద్రిక్తతల మధ్యే ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగం సమయంలోనూ వైసీపీ నేతలు నిరసన తెలిపారు.

పోలీసులపై జగన్ తీవ్ర ఆగ్రహం

మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. 'సేవ్ డెమొక్రసీ' అని నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు నేతల చేతుల్లోంచి ఫ్లకార్డులను లాక్కొని చించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకుని చించే అధికారం మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. అధికారం ఎల్లకాలం ఒకరి చేతుల్లోనే ఉండదని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏంటో తెలుసా.? అని ప్రశ్నించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఉన్నారని.. అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడానికి కాదని ధ్వజమెత్తారు.

సభ నుంచి వాకౌట్ 

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read: YS Jagan: 'సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' - పోలీసులపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం, ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget