అన్వేషించండి

GVL : న్యాయపరంగా మూడు రాజధానులు అసాధ్యం - వైఎస్ఆర్‌సీపీకి క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ !

న్యాయపరంగా మూడు రాజధానులు సాధ్యం కావని ఏపీ ప్రభుత్వానికి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టవద్దని సూచించారు.

GVL :   మూడు రాజధానులు ఏర్పాటు చేసుకునే చట్టం చేసుకునే అవకాశం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అలా పిటిషన్ దాఖలు చేయగానే .. ఇలా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. న్యాయపరంగా మూడు రాజధానులు సాధ్యం కావని స్పష్టం చేశారు. మూడు రాజాధానుల ప్రతిపాదన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. మూడు రాజధానులు దేవుడెరుగు.. మూడేళ్లలో మూడు బిల్డింగ్‌లైనా కట్టారా? అని ప్రశ్నించారు. ఏ అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.    

రాజధానుల అంశం కేంద్రం జోక్యం చేసుకునేది కాదు !

రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని జీవీఎల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదన్నారు. అమరావతి రైతుల ఎప్పుడూ అండగానే ఉంటుందని ఎంపీ జీవీఎల్‌ అన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని.. వారు భూములు ఇచ్చింది ఒక రాజకీయ పార్టీకి కాదు..ప్రభుత్వానికికని జీవీఎల్ గుర్తు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు న్యాయం కోం వారు యాత్ర చేయడంలో తప్పు లేదని..  వారి యాత్రకు తమ  మద్దతు ఉంటుందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అసలేమీ చేయకుండానే  మూడు రాజధానులు కడతామంటున్నారు ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా అని ప్రశ్నించారు. 

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలన్న జీవీఎల్ 

ఏపీలో  స్వచ్చమైన రాజకీయాలు రావాలని అందుకోసం  బీజేపి - జనసేన కూటమి అధికారంలోకి తీసుకురావాలని ఆయన  ప్రజలకు పిలుపునిచ్చారు. ఛిన్నభిన్న మైన అర్థిక పరిస్ధితి జగన్ కి కనిపించటం లేదు...ఆదాయంలేదు, అభివృద్ధి లేదన్నారు.  జిఎస్టీ లో రాష్ట్ర వాటా కింద  41 శాతం ఏపికి ఇవ్వడంలో ఎక్కడా ఆలస్యం జరగడంలేదని..  కేంద్రం కంటే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అసెంబ్లీ సాక్షిగా  తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం సిగ్గుచేటని జీవీఎల్ మండిపడ్డారు. బలీయమైన అర్థిక వ్యవస్ధ ఏపిలో వుందని  చెప్పుకోడానికి మీదగ్గర ఏముందని ప్రశ్నించారు.  151 సీట్లు గెలుచుకున్న వైసిపి ఏపిని పతనావస్ధకు తీసుకు వెళ్లిందన్నారు. ఉమ్మడి జాబితాలో పథకాలకు రాష్ట్ర వాటా చెల్లింపులు ఎందుకు ఇవ్వడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. 

కేంద్ర ప్రాజెక్టులకు ఏపీ సహకారం శూన్యం : జీవీఎల్ నరసింహారావు

కోటిపల్లి నర్సాపూర్ , బెంగళూరు కడప రైల్వే ప్రాజెక్టులకు ఏపి నుంచి సహకారం శూన్యం అని మండిపడ్డారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి పై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని సవాల్ చేసారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఓట్లు పడవని స్పష్టం చేశారు.  రాజధానుల విషయంలో ప్రజలను మభ్య పెట్టవద్దని వైఎస్ఆర్‌సీపీకి సహకరించారు. ఇటీవలి కాలంలో ఏపీలో అమరావతి రాజధానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో జీవీఎల్ ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget