అన్వేషించండి

YS Jagan meets Governor: గవర్నర్‌తో జగన్ దంపతుల భేటీ - లిక్కర్ స్కామ్ అరెస్టులపై ఫిర్యాదు?

AP Governor: ఏపీ గవర్నర్‌తో మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి సమావేశమయ్యారు. లిక్కర్ స్కామ్ పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

Jagan met AP Governor:  వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి .. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యారు. ఆయన వెంట సతీమణి భారతి కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి సోమవారం ఉదయం తాడేపల్లికి వచ్చిన జగన్ దంపతులు మధ్యాహ్నం గవర్నర్ తో సమావేశం అయ్యారు. ప్రధానంగా లిక్కర్ స్కాం లో జరుగుతున్న అరెస్టులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ పేరుతో భేతాళకథలు చెబుతూ.. లేని స్కాంలో ఆధారాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తమ వాదనకు బలం చేకూర్చేలా కొన్ని డాక్యుమెంట్లను కూడా గవర్నర్ కు జగన్ అందించినట్లుగా చెబుతున్నారు. 

లిక్కర్ స్కాంలో వైఎస్ భారతిని కూడా ఇరికించేందుకు సిట్ ప్రయత్నిస్తోందని జగన్ అనుమానిస్తున్నారు. ఇప్పటికే భారతి సిమెంట్స్ కు ఆడిటర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. ఆయన వైఎస్ భారతికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్ని చూసుకుంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో గత వారం.. హైదరాబాద్ సిట్ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. భారతి సిమెంట్స్  హైదరాబాద్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప చాంబర్ లోనూ సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

మరో వైపు లిక్కర్ సొమ్ము పెద్ద ఎత్తున భారతి సిమెంట్స్ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. నగదుకు సంబంధించిన సమావేశాలు, ఆ నగదును లాండరింగ్ చేయాల్సిన పద్దతుల గురించి..  భారతి సిమెంట్స్ కార్యాలయంలోనే చర్చించినట్లు సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే వైఎస్ భారతిని కూడా ఈ కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానంతో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. 

లిక్కర్ స్కామ్‌తో పాటు ఏపీలో వరుసగా వైసీపీ నేతలపై కేసులు పెడుతూండటం, అరెస్టులు చేస్తూండటంతో పాటు.. తన పర్యటనకు వెళ్లినప్పుడు ఉద్రిక్తతలు సృష్టిస్తూడటంపైనా గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.గవర్నర్ స్పందన ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. మామూలుగా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేంగా ఫిర్యాదు చేయాలంటే.. పార్టీ నేతలందరితో కలిసి వెళ్తూంటారు. కానీ జగన్ ఈ సారి తన భార్య భారతిని మాత్రమే తీసుకుని వెళ్లి గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా  మారింది. 

వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రభుత్వం వేధిస్తోందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు లిక్కర్ పాలసీతో సంబంధం లేని వారిని అరెస్టులు చేస్తున్నారని పలుమార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే గవర్నర్ కు  చెప్పుకోవడం వల్ల వైఎస్ జగన్ కు ఏమీ ఉపయోగం ఉండదని.. ఆయన ఏమైనా డాక్యుమెంట్లు ఇచ్చి ఉంటే.. వాటిని పరిశిలించాలని ప్రభుత్వానికే పంపుతారని అంటున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. గవర్నర్ ద్వారా కేంద్రానికి ఏదైనా విజ్ఞప్తులు పంపాలని అనుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో.. గవర్నర్ తో జగన్ దంపతులు సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
Advertisement

వీడియోలు

Skeleton Lake: 16 వేల అడుగుల ఎత్తులో ఎటు చూసినా ఎముకలే..
Shubman Gill Performance | వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్మన్ గిల్
Rohit Sharma Records | India vs Australia ODI Series | రికార్డుల మోత మోగించిన రోహిత్
India vs Australia | Women's World Cup | ఆసీస్ తో భారత్ ఢీ
India vs Bangladesh | Women's World cup | బంగ్లాతో తలపడనున్న భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
NBK111 Movie: బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
Kurnool Bus Accident: 18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
Cyclone Montha Impact in AP: మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Embed widget