అన్వేషించండి

Vijayawada Floods: వరద ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా - రంగంలోకి నేవీ హెలికాఫ్టర్లు, అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం

Vijayawada News: విజయవాడ వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఫుడ్ సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ట్రయల్ రన్ నిర్వహించారు.

Food Supply Through Drones In Vijayawada: విజయవాడలోని (Vijayawada) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు సమీపంలోని కల్యాణ మండపాలు, స్కూళ్లల్లో పునరావాసం కల్పించారు. వారికి 3 పూటలా ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ల సాయంతో చిన్నారులు, వృద్ధులు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తమకు కనీసం ఆహారం అందడం లేదని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోట్లు సైతం వెళ్లలేని మారుమూల ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం, తాగునీరు అందించడం కష్టంగా మారింది. దీనిపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ఆహారం సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది. బోట్లు, హెలికాఫ్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయంగా డ్రోన్ల వినియోగంపై ఫోకస్ చేసింది. అందుబాటులో ఉన్న 3 డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్‌ను అధికారులు నిర్వహించారు.

పర్యవేక్షించిన సీఎం

సీఎం చంద్రబాబు (CM ) స్వయంగా ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. ఓ మినీ హెలికాఫ్టర్‌లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువు మోయగలవు.? ఏయే ప్రదేశాల వరకూ వెళ్లగలవు.?, మార్గమధ్యలో ఏమైనా అడ్డంకులు వస్తే ఎలా తప్పించుకుని రాగలవు.? వంటి అంశాలను ఈ రన్‌లో పరిశీలించారు. ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకూ ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో పరిశీలించి ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ట్రయల్ రన్‌కు 3 ఫుడ్ డెలివరీ డ్రోన్లను వినియోగించగా.. మరో 5 డ్రోన్లు సిద్ధంగా ఉంచారు.

రంగంలోకి నేవీ హెలికాఫ్టర్లు

మరోవైపు, వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే నేవీ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. విజయవాడ నగరంలో 78, కృష్ణా జిల్లాలో 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

సీఎం ఆగ్రహం

అటు, విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన అనంతరం సీఎం చంద్రబాబు మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు సహాయం అందించడంలో ఇప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని.. స్వయంగా తానే రంగంలోకి దిగినా ఇంకా మొద్దనిద్ర వీడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరగడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని.. ప్రజలు బాధల్లో ఉంటే అండగా ఉండాల్సింది పోయి ఇలా ప్రవరిస్తే సహించేది లేదని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు - మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు, రంగంలోకి నిపుణులు కన్నయ్య నాయుడు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Google AI Hub Issue: గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం
గూగుల్ ఏఐ హబ్‌కు భూముల కేటాయింపుపై తిరుపతి ఎంపీ పిల్ - ఏపీపై జగన్ ద్వేషానికి నిదర్శనమని లోకేష్ ఆగ్రహం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget