అన్వేషించండి

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు - మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు, రంగంలోకి నిపుణులు కన్నయ్య నాయుడు

Vijayawada News: ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతికి 4 బోట్లు కొట్టుకువచ్చిన గేట్లను ఢీకొన్నాయి. ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతినగా.. ప్రభుత్వం డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడిని రంగంలోకి దించింది.

Damage In Prakasam Barrage Gates Due To Boats: విజయవాడ ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. అధికారులు మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 24.4 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. కాగా, వందేళ్లలో ఇది రెండో అతిపెద్ద వరద ప్రవాహంగా తెలుస్తోంది. 2009 అక్టోబర్ 5న 10,94,422 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే కృష్ణమ్మకు వరద పోటెత్తినట్లు పేర్కొంటున్నారు. 

బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు

అటు, కృష్ణమ్మ వరద ఉద్ధృతికి 4 బోట్లు కొట్టుకొచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బోట్లు బ్యారేజీ 3, 4 గేట్లను ఢీకొన్నాయి. గేట్ల నుంచి విడుదలవుతోన్న నీటికి ఇవి అడ్డంకిగా మారడంతో నీరు నిలిచిపోయింది. దాదాపు 40 కి.మీ వేగంతో వచ్చి బోట్లు ఢీకొనగా బ్యారేజీలోని ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. ఇరుక్కున్న 4 బోట్లలో ఒకటి కొట్టుకుపోయింది. అయితే, 69వ నెంబర్ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ ధ్వంసం చేసిన బోటు అలానే ఉండగా.. ఇది తీసేందుకు నిపుణులు రావాలని బ్యారేజీ డ్యాం సేఫ్టీ ఇంజినీర్ రత్నకుమార్ తెలిపారు. 'గతంలో ఎన్నడూ చూడనంత వరద ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. కొట్టుకు వచ్చిన బోట్ల తాకిడికి బ్యారేజీలోని 69వ గేట్ వద్ద కౌంటర్ నిర్మాణం విరిగిపోయింది. దీని వల్ల ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా భవిష్యత్ దృష్ట్యా కొత్త కౌంటర్ వెయిట్ ఏర్పాటు చెయ్యాలి. ప్రకాశం బ్యారేజీలో ఎన్నడూ లేనంతగా లేనంత వాటర్ ఇన్ ఫ్లో వెళ్తోంది. బోట్ల తాకిడితో ప్రస్తుతం వాటర్ ఇన్ ఫ్లోకి ఇబ్బంది లేకపోయినా.. మళ్లీ వరద వస్తే సమస్య అవుతుంది. మరో 3 రోజుల్లో హైబ్రిడ్ కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తాం. ప్రవాహం తగ్గగానే బోట్లను తొలగిస్తాం' అని పేర్కొన్నారు.

రంగంలోకి కన్నయ్య నాయుడు

ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న గేట్ వద్ద కౌంటర్ వెయిట్ నిర్మాణానికి జల వనరుల నిపుణుడు కన్నయ్య నాయుడును ప్రభుత్వం రంగంలోకి దించింది. ఆయన సోమవారం సాయంత్రానికి బ్యారేజీ వద్దకు చేరుకుని పనులు పర్యవేక్షిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతారని చెప్పారు. కాగా, ఇటీవలే తుంగభద్ర జలాశయం ప్రవాహంలో 19వ గేట్ కొట్టుకుపోగా.. నీటి వృథాను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని పిలిపించారు. ఆయన కేవలం 4 రోజుల్లోనే స్టాప్ లాగ్ గేట్ విజయవంతంగా అమర్చి దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ అద్భుతాన్ని సాధించారు. ఈ క్రమంలో ఆయన్ను ఏపీ ప్రభుత్వం జల వనరుల మెకానికల్ విభాగం సలహాదారులుగా నియమిస్తూ గౌరవించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ విషయాల్లో ఆయన సలహాదారుగా కొనసాగుతున్నారు. 

Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం - వందేళ్లలో రెండో అతి పెద్ద వరద, వాహనాల రాకపోకలు బంద్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget