అన్వేషించండి

Vijayawada Floods: హృదయ విదారకం - నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు, విజయవాడలో కన్నీటి దృశ్యాలు

Vijayawada News: విజయవాడ చిట్టినగర్ పరిధిలో ఓ బాలుడి మృతదేహం నడుము లోతు నీటిలో తరలించడం అందరినీ కలిచివేసింది. వరదలతో నగరంలో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Floods In Vijayawada: విజయవాడలో (Vijayawada) వరదలతో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. అటు, చిట్టినగర్ (Chitti Nagar) పరిధిలో ఓ 14 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని నడుము లోతు నీటిలో తరలించడం ఆందోళన కలిగించింది. అదృశ్యమైన బాలుడు వరదల్లో విగతజీవిగా మారాడు. బాలుని మృతదేహాన్ని తరలిస్తోన్న సమయంలో ఆ తల్లి గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి కొందరు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఎలక్ట్రిక్ వస్తువులు, ఇంటి సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయని.. చాలా వరకూ ఫైనాన్స్ మీద తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జీరో నుంచే ప్రారంభమయ్యాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

మరోవైపు, వరద నుంచి బయటపడిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతోంది. అలాంటి చోట్ల అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల ద్వారా బురదను తొలగిస్తున్నారు. రోడ్లు, ఇళ్లు, షాపుల్లో బురదను తొలగిస్తున్నారు. దాదాపు 113 ఫైరింజన్లు నగరానికి చేరుకోగా.. 50 ఫైరింజన్ల ద్వారా సిబ్బంది శుభ్రత పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 32 డివిజన్లలో పలు ప్రాంతాలు ముంపునకు గురైనట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా అపరిశుభ్రంగా మారింది. కొన్ని చోట్ల టన్నుల కొద్దీ వాడేసిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులు చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కుపోయాయి. సిబ్బంది వీటిని తొలగించేందుకు యత్నిస్తున్నారు.

మళ్లీ వర్షం

అటు, విజయవాడలో మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఉంది. వర్షం పడుతున్నా సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదని.. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అటు, బుడమేరుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, వరద తగ్గిన ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం కారణంగా వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతం అజిత్ సింగ్ నగర్‌లో ఆర్టీసీ ఉచిత బస్సులు అందుబాటులో ఉంచారు.

విజయవాడలో అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని రప్పించిన అధికారులు రోడ్లు, కాల్వల్లోని మట్టి, ఇసుక మేటలు, చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. చెత్త తొలగించి దుర్వాసన రాకుండా బ్లీచింగ్ ఫౌడర్ చల్లారు. అధికారులు సెలవులు సైతం తీసుకోకుండా సాయం కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారుల నియామకంతో అక్కడ సహాయం వేగంగా అందుతోంది. సాయం అందించేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు, ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, వంటనూనె, చక్కెర, కూరగాయలతో కలిపి ఓ కిట్‌ను అందించనున్నారు.

Also Read: Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - గోదావరికి పెరిగిన ఉద్ధృతి, ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget