అన్వేషించండి

Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - గోదావరికి పెరిగిన ఉద్ధృతి, ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటంటే?

Water Projects: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జల ప్రవాహం కొనసాగుతోంది. గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా.. కృష్ణమ్మ కాస్త శాంతించింది.

Floods In Water Projects: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద భారీగా చేరుతోంది. విజయవాడలో (Vijayawada) కృష్ణమ్మ ఉగ్రరూపం కాస్త శాంతించింది. అటు, గోదావరికి వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 11 అడుగులుగా నమోదైంది. ఇక్కడి నుంచి సముద్రంలోకి దాదాపు 8.80 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అటు, భద్రాచలం వద్ద కూడా గోదారమ్మ ఉగ్ర రూపం కొనసాగుతోంది. 44.3 అడుగుల నీటి మట్టం ఉండగా.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 9,74,666 క్యూసెక్కుల వరదను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు

మరోవైపు, ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతుల పనులు నిపుణుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. బ్యారేజీ 67, 68, 69 నెంబర్ గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల బ్యారేజీ 69వ గేట్ వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతినగా.. ఇంజినీరింగ్ నిపుణులు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది పనులు చేపట్టింది. కాగా, ఇటీవలే ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చిన 4 బోట్లు ఢీకొని గేట్లు దెబ్బతిన్నాయి. 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డు పడడంతో వాటి నుంచి నీటి ప్రవాహం సక్రమంగా సాగలేదు. దీంతో బెకెమె ఇన్ ఫ్రా సిబ్బంది తొలుత 67, 69 గేట్లను మూసేసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. 7 రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

శ్రీశైలం గేట్లు మూసివేత

అటు, ఎగువ నుంచి శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద తగ్గుముఖం పట్టిన క్రమంలో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసేశారు. బుధవారం 6 గేట్లలో నీటిని దిగువకు విడుదల చేయగా.. మధ్యాహ్నానికి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో అన్ని గేట్లనూ అధికారులు మూసేశారు. ఈ క్రమంలో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధమయ్యారు. జూరాల క్రస్ట్ గేట్ల ద్వారా 1,05,870 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 31,106 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం ద్వారా 17,916 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు విడుదలైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 209.1579 టీఎంసీలుగా ఉంది.

తెలంగాణలో ప్రాజెక్టులకు వరద

అటు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో భారీగా వరద చేరుతుండగా.. 3 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,404 అడుగులకు (17.079 టీఎంసీలు) చేరుకుంది. మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలకు భారీగ ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 46 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. తాలిపేరుతో పాటు చింతవాగు, రోటెంత వాగులు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 40,496 క్యూసెక్కులు వస్తుండగా.. 3,186 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 28.22 టీఎంసీల నిల్వ ఉంది. నీటి నిల్వ 523.60 మీటర్లకు గానూ 523.2 మీటర్ల వద్ద నీరు ఉంది.

Also Read: Vijayawada Floods: విజయవాడలో మళ్లీ వర్షం - నగరవాసుల ఆందోళన, ఆ నీళ్లు తాగొద్దంటూ అధికారుల హెచ్చరిక

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget