అన్వేషించండి

Vijayawada Floods: విజయవాడలో మళ్లీ వర్షం - నగరవాసుల ఆందోళన, ఆ నీళ్లు తాగొద్దంటూ అధికారుల హెచ్చరిక

Andhra News: విజయవాడ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో ఫైరింజన్లతో శుభ్రం చేస్తున్నారు.

Floods In Vijayawada: విజయవాడలో (Vijayawada) మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు, నగరంలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి కాస్త బయటపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది పలు చోట్ల బురదను తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 113 ఫైరింజన్లు విజయవాడ చేరుకున్నాయి. ఇప్పటికే ఇళ్లల్లో చేరిన మట్టి, బురదను 50 ఫైరింజన్ల ద్వారా సిబ్బంది తొలగిస్తున్నారు. నగరంలోని మొత్తం 32 డివిజన్లలో పలు ప్రాంతాలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వరద పూర్తిగా తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, షాపులు శుభ్రం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అటు, బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తోన్న పుకార్లు నమ్మొద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. సమీప ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని.. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవని.. ఒకవేళ వరద వస్తే సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.

30 ఏళ్ల చరిత్రలో..

అటు, బుడమేరు ఉగ్రరూపంతో నందివాడ మండలంలో 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో బుడమేరు ఇలా ఊళ్లను ముంచేయడం ఇదే తొలిసారని బాధితులు చెబుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గండ్లు పడకుండా పలు గ్రామాల రైతులు, స్థానికులు నిద్రాహారాలు మాని పహారా కాస్తున్నారు. అధికారులు బాధితులను పడవలు, ట్రాక్టర్లు, బస్సుల్లో గుడివాడ ఇతర ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా గ్రామాల్లో మోకాలి లోతున కొన్నిచోట్ల నడుము లోతు నీరు చేరింది. చుట్టుపక్కల చేపల చెరువులే ఉండడంతో వరదకు గండ్లు పడితే ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మరోవైపు, అర్ధరాత్రి భారీ వర్షం, ఉద్ధృతంగా గాలి వీస్తున్నా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గండ్ల పూడిక పనుల్లో నిమగ్నమయ్యారు. ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకూ పనులకు ఆటంకం లేకుండా జోరు వానలోనే తడుస్తూ దగ్గరుండి మరీ పనులు పర్యవేక్షించారు. అటు, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ వరద ప్రాంతాలను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. ప్రభావిత గ్రామాలకు కలెక్టర్ ప్రత్యేకాధికారులను నియమించారు.

'ఆ నీటిని తాగొద్దు'

కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తోన్న నీటిని తాగడానికి వాడొద్దని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజలందరికీ తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. అటు, పునరావాస కేంద్రాల్లో బాధితులకు సిబ్బంది ఆహారం అందిస్తున్నారు. నగరంలోని 32 డివిజన్లతో పాటు సమీప 5 గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు.. ఇక్కడ మెడిసిన్స్ అందుబాటులో ఉంచారు. అటు, విజయవాడ అజిత్‌సింగ్ నగర్ నుంచి ఆర్టీసీ ఉచిత బస్సులు అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు 6 బస్సులు వెళ్తున్నాయి.

Also Read: Rains In Godavari:ఉభయగోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం- లోతట్టు ప్రాంతాలు జలమయం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget