అన్వేషించండి

CPI Ramakrishna: చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటే ఎగతాళిగా మాట్లాడుతారా?: సీపీఐ నేత రామకృష్ణ ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటే ఎగతాళిగా మాట్లాడుతారా? అని మండిపడ్డారు. ఆరోగ్య సమస్యలపై వైద్యులు చెప్పాలి గానీ... డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు . ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వెల్లడించారు. " కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సదస్సులు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ పునః పంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి కూడా దీనిని అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు" అని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. 

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించారన్నారు. 12 రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ లోకేష్‌కు ఒక్కరోజు కూడా హోంమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గద్దె దిగే వరకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకమవుతాయని రామకృష్ణ స్పష్టం చేశారు. 

గత నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలేనన్నారు. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పుచాలా ఎక్కువని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ చేసిన అప్పులు వేల కోట్ల వరకు ఉంటాయని చెప్పారు. జగన్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి ఆరుసార్లు వేల కోట్లు అప్పు చేసిందని రామకృష్ణ అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఏపీలో లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ప్రజలపై గుదిబండగా మారాయని రామకృష్ణ అన్నారు. 

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి ఢిల్లీలో  ఉండగానే కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా.. అప్పర్ భద్రకు అనుమతులు ఇచ్చింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో పునః పంపిణీ ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేయడానికే. సీఎం ఉత్తరం రాసి వదిలేశారు తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తున్నా.. దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారు. చేతకాని దద్దమ్మ సీఎంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాలు పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలి. పవన్ కళ్యాణ్‌ని అభినందిస్తున్నా. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆయన తన వైఖరి చెప్పారు.’’ అని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget