అన్వేషించండి

CPI Ramakrishna: చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటే ఎగతాళిగా మాట్లాడుతారా?: సీపీఐ నేత రామకృష్ణ ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటే ఎగతాళిగా మాట్లాడుతారా? అని మండిపడ్డారు. ఆరోగ్య సమస్యలపై వైద్యులు చెప్పాలి గానీ... డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు . ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వెల్లడించారు. " కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సదస్సులు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ పునః పంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి కూడా దీనిని అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు" అని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. 

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించారన్నారు. 12 రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ లోకేష్‌కు ఒక్కరోజు కూడా హోంమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గద్దె దిగే వరకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకమవుతాయని రామకృష్ణ స్పష్టం చేశారు. 

గత నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలేనన్నారు. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పుచాలా ఎక్కువని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ చేసిన అప్పులు వేల కోట్ల వరకు ఉంటాయని చెప్పారు. జగన్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి ఆరుసార్లు వేల కోట్లు అప్పు చేసిందని రామకృష్ణ అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఏపీలో లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ప్రజలపై గుదిబండగా మారాయని రామకృష్ణ అన్నారు. 

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి ఢిల్లీలో  ఉండగానే కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా.. అప్పర్ భద్రకు అనుమతులు ఇచ్చింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో పునః పంపిణీ ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేయడానికే. సీఎం ఉత్తరం రాసి వదిలేశారు తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తున్నా.. దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారు. చేతకాని దద్దమ్మ సీఎంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాలు పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలి. పవన్ కళ్యాణ్‌ని అభినందిస్తున్నా. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆయన తన వైఖరి చెప్పారు.’’ అని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CNG Shortage In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలాలి.. భార్యకు చెబుతూ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలాలి.. భార్యకు చెబుతూ వీడియో రికార్డు చేసిన భర్త !
LPG Gas Booking : గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Embed widget