అన్వేషించండి

CM Jagan: రాష్ట్రం శ్రీలంకలా ఉందట, ఉచిత పథకాలు ఆపేయాలట- విపక్షంపై జగన్ పంచ్‌లు

Ongole: ఒంగోలులో శుక్రవారం (ఏప్రిల్ 22) నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో ఏకంగా రూ.1,36,694 కోట్లను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా లంచాలకు తావు ఇవ్వలేదని, నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని అన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా ఏ సంక్షేమ పథకానికీ లోటు రానివ్వలేదని అన్నారు. ఒంగోలులో శుక్రవారం (ఏప్రిల్ 22) నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. 

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. తద్వారా 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని కోటికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది. ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్మును జమ చేయనున్నారు. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా వైఎస్ఆర్ సున్నా వడ్డీల పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లు అవుతుంది.

ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఏపీని శ్రీలంకను చేస్తున్నారని చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుతో పాటు కొన్ని మీడియా సంస్థలు కలిపి దుష్టచతుష్టయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు మంచి చేయొద్దనే ఉద్దేశం వారిదని.. అలాంటి రాక్షసులు, దుర్మార్గులతో తాము యుద్ధం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.

సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటిదాకా రూ.3,615 కోట్లు
‘‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద తొలి ఏడాది రూ.1258 కోట్లు, రెండో విడత కింద రూ.1,096 కోట్లు, మూడో ఏడాది రూ.1261 కోట్లు చెల్లిస్తున్నాం. ఈ మూడేళ్లలో ఈ పథకం కోసం రూ.3,615 కోట్లను మహిళల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. మొత్తం 1.2 కోట్ల మందికి పైగా మహిళలకు దీనివల్ల మేలు కలిగింది. గతంలో 12 శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చినా కూడా.. వారికి మంచి జరగాలని గత ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయి.

‘‘రాష్ట్రంలో మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచింది. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టింది.’’ అని సీఎం జగన్ విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget