By: ABP Desam | Updated at : 29 Apr 2022 08:40 PM (IST)
ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష
టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నతవిద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదని ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. సమర్ధు్లైన వారిని, ప్రతిభ ఉన్నవారిని టీచింగ్ స్టాఫ్గా తీసుకోవాలి...వారికీ పరీక్షలు నిర్వహించి... ఎంపిక చేయాలని ఆదేశించారు. టీచింగ్ స్టాఫ్ కమ్యూనికేషన్ల నైపుణ్యాన్నికూడా పరిశీలించాలన్నారు. యూనివర్శిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవని ...ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
డిగ్రీ విద్య ప్రత్యేక యూనివర్సిటీ పరిధిలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీకాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలని జగన్ ఆదేశించారు. ఇందులో మంచి పరిజ్ఞానం ఉన్నవారిని ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలన్నారు. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలని.. ఏపీలో డిగ్రీలు చదివితే.. మంచి జీతాలు వచ్చే పరిస్థితిని తీసుకురావాని ఆదేశించారు.
విద్యార్థుల ఎన్రోల్మెంట్ చాలా ముఖ్యమని అందుకే విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. గతంలో కన్నా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగినా సంతృప్తి చెందకూడదని
జీఈఆర్ 80శాతానికి పైగా ఉండాలన్నారు. ఉద్యోగాలను కల్పించే చదువులు దిశగా కోర్సులు ఉండాలి..ఇప్పుడున్న కోర్సులకు సంబంధించి అనుబంధకోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లిషుపై పట్టు, ప్రావీణ్యం విద్యార్థులకు రావాలి..వీటిపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఆర్ఈ, జీ మ్యాట్ పరీక్షలపైన కూడా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు.
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, అంతమందికీ విద్యాదీవెన, వసతి దీవెన ఇస్తున్నామని ఇంతకుముందు చదివించే స్తోమత లేక, చాలామంది అబ్బాయి చదువుకుంటే చాలు అని.. అమ్మాయిలను పై చదువులకు పంపలేని పరిస్థితులు ఉండేవన్నారు. అలాంటి పరిస్థితులను పూర్తిగా తీసేయడానికి ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ కూడా విద్యాదీవెన, వసతి దీవెన వర్తింపు చేస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు..వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.
రాష్ట్రంలో 4–5 యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని, దేశంలో ఉత్తమ యూనివర్శిటీల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. దీన్ని ఒక లక్ష్యంగా తీసుకుని ముందడుగులు వేయాలన్నారు. పట్టభద్రులకు తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్షిప్ ఉండాలని.. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్యకాలేజీల్లో కూడా ఇంటర్న్షిప్ కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ .. నియోజకవర్గంలో ఉన్న జూనియర్ కాలేజీని డిగ్రీకాలేజీ స్థాయికి తీసుకెళ్లాలన్నారు చదువులు ఏదోరకంగా సాగితే చాలు అన్నవాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే భావన ఇవాళ దేశంలో ఉంది. కానీ విదేశాల్లో డిగ్రీ అన్నది చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారు ఏపీలో డిగ్రీ కోర్సులను కూడా ఆ స్థాయికి తీసుకురావాలన్నారు.
Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిల మార్పు
Balineni Srinivasa Reddy: బాలినేనికి డోర్స్ క్లోజ్ అయినట్టే! సీఎంఓ ఫైనల్ వార్నింగ్!
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
JC Prabhakar Reddy: ఆర్టీవో ఆఫీస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన, వాళ్లు ఎదురొస్తే కాల్చేస్తామని వార్నింగ్!
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Highest Selling Hatchback Cars: నవంబర్లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్బాక్లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
/body>