అన్వేషించండి

CM Jagan YSRCP Review : ముందస్తుకు వెళ్తున్నారా ? ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీ ఇదిగో !

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.

 

CM Jagan YSRCP Review :   ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని  విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎమ్మెల్యేల సమావేశం పెట్టారని.. గడప గడపకూ సమీక్షా కార్యక్రమంలో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయన్న అంశంపై స్పష్టత ఇస్తారని అనుకున్నారు. అయితే ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇవ్వలేదు. సమయానికే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్తారని జరుగుతున్న ప్రచారాన్ని జగన్ లైట్ తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. అయితే పార్టీ కార్యక్రమాలను మాత్రం ఎన్నికల్పరచారం అన్నట్లుగా ప్రచారం చేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.              

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అసలు టీడీపీ గెలిచింది నాలుగు మాత్రమేనని మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయన్నారు. అందులో టీడీపీ నాలుగే గెలిచిందన్నారు. ఈ నాలుగు స్థానాల్లో గెలిచి .. ఏదో జరిగిపోయిందని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. వాపును చూపి బలుపు అనుకుంటున్నారని... ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్లుగా తెలుస్తోంది.                         

ముందస్తు ఎన్నికలు లేవని చెప్పినా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా కార్యచరణను మంత్రులకు సీఎం జగన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటింటికి స్టిక్కర్ అంటించే కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యేలు ఈ ఏడాది పాటు తీరిక లేకుండా జనాల్లో తిరిగేలా భిన్నమైన కార్యక్రమాలకు రూపకకల్పన చేయబోతున్నట్లుగా తెలిపినట్లుగా తెలు్సతోంది.                   

ఇటీవల సీఎం జగన్ వరుసగా ఢిల్లీ పర్యటనలు జరుపుతూండటంతో .. .గవర్నర్‌తోనూ సమావేశం కావడంతో  తెలంగాణతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కేంద్రం అనుమతి లేకుండా అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి  పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్రం మద్దతు అవసరమని భావిస్తున్నారు. అయితే కేంద్రం ఎలా స్పందించిందో స్పష్టత లేదు కానీ.. సీఎం జగన్ ఢిల్లీ నుంచే ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాన్ని ఖారరు చేశారు. ఆ మేరకు సోమవారం సమావేశం నిర్వహింారు.                

బయటకు ముందస్తు ఎన్నికలు లేవని చెప్పినప్పటికీ..   నాలుగు నెలల ముందుగా ఎన్నికలు జరగడం ముందస్తు కాకపోవచ్చని.. డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే..  అవి ముందస్తు కాదన్న అభిప్రాయాన్ని జగన్ తర్వాత వ్యక్తం చేయవచ్చని  పార్టీ నేతలు చెబుతున్నారు.  సీఎం జగన్ ఏం చెప్పినా ఆయన కార్యాచరణ ప్రకారం డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు.           

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget