అన్వేషించండి

CM jagan Review : పెండింగ్ పథకాలకు కొత్త తేదీలు ఖరారు - విద్యాదీవెన, ఆసరా బటన్లను సీఎం జగన్ ఎప్పుడు నొక్కబోతున్నారంటే ?

పెండింగ్‌లో పథకాలకు నిధులు విడుదల చేసే కొత్త తేదీలను సీఎం జగన్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష నిర్వహించారు.


CM jagan Review :    మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు పై అ  సీఎంఓ అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు..అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ను ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన పలు కార్యక్రమాలను గురించి అధికారులు సీఎం కు వివరించారు. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఆయా కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేయాలన్నారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ లో సమావేశాల షెడ్యూలు ఖరారు అవుతుందని  అందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మార్చి 18 సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం… జగనన్న విద్యాదీవెన కింద నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో జమ చేయనున్నారు. మార్చి 22  ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన జరుగుతుందని, వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.  మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని  ప్రారంభించనున్నారు.  మార్చి 25 నుంచి ప్రారంభం  వైఎస్సార్‌ ఆసరా పథకం నిధులను జమ చేస్తారు.  ఏప్రిల్‌ 5 వరకూ ఈ పథకం అమలు కొనసాగుతుందని ప్రకటించారు. మార్చి 31న జగనన్న వసతి దీవెన, ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు, ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం, ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో అదికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.


ఈ  నెల  14  నుంచి  ఏపీ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల జరగబోతున్నాయి.  పది  రోజుల  పాటు  అసెంబ్లీ  సమావేశాలు జరిగే  అవకాశం ఉంది. కొన్ని  కీలక  అంశాలకు  సంబంధించి  అసెంబ్లీ  వేదికగా  సీఎం  జగన్  మాట్లాడనున్నారని ఇప్పటికే ముందస్తు సమాచారం అందింది. మొదటి  రోజు  గవర్నర్  ప్రసంగం ఉంటుంది. ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన గవర్నర్ తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ,మండలి సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.  ఆ తర్వాత  బీఏసీ  సమావేశం  జరుగుతుంది. బడ్జెట్  ఎప్పుడు  పెడతారు  అనేది  బీఏసీ  లో  నిర్ణయం  తీసుకుంటారు.  అసెంబ్లీ వేదికగా  సీఎం  జగన్  మూడు  రాజధానులు... రాష్ట్రంలో  జరుగుతున్న  అభివృద్ధి  . సంక్షేమ  పథకాలకు  సంబంధించి  మాట్లాడే  అవకాశం  ఉంది. 

ఎన్నికలకు  ముందు  జరిగే  బడ్జెట్  సమావేశాలు  కాబట్టి ఈ సారి  కొన్ని  రంగాలకు  అధిక  ప్రాధాన్యత  ఇవ్వనున్నారు . .వ్యవసాయ  విద్య వైద్య  రంగాలకు  ప్రాధాన్యత  ఇవ్వనున్నారు. అదే  విధంగా  మహిళలకు  కూడా  ప్రాధాన్యత  ఇచ్చే విధంగా  బడ్జెట్  కేటాయింపులు ఉండనున్నాయని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.  .ఈ సారి  కూడా   టీడీపీ కూడా  కీలక  అంశాలకు  సంబంధించి అసెంబ్లీ  లో చర్చ  లెవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన ధరలు.. రాష్ట్రంలో  లా అండ్  ఆర్డర్  ఇతర  అంశాలపై  టీడీపీ  చర్చ కు పట్టు బట్టే  అవకాశాలు ఉన్నాయి .  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Tech Layoffs: 2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Sahara Desert Tragedy: సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
సహారా ఎడారిలో శవాల గుట్టలు - ఎందుకిలా జరుగుతోంది?
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
Embed widget