అన్వేషించండి

CM Chandrbabu: సాధారణ స్థితికి విజయవాడ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra News: మంగళవారం సాయంత్రంలోపు విజయవాడలో పరిస్థితి పూర్తిగా చక్కదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతరం పాలనా వ్యవహారాలపై దృష్టి సారించాలన్నారు.

CM Chandrababu Review On Vijayawada Floods: గత 10 రోజులుగా వరదలతో అతలాకుతలమైన విజయవాడ (Vijayawada) నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. మంగళవారం సాయంత్రంలోపు పూర్తిగా పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం అర్ధరాత్రి వరకూ ఆయన సమీక్ష నిర్వహించారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని.. పూర్తిగా చక్కదిద్దిన అనంతరం ఇతర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అటు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆయా ప్రాంతాల మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదిక సమర్పించాలని నిర్దేశించారు.

సహాయక చర్యలపై..

ముంపునకు గురైన 32 వార్డుల్లో 26 చోట్ల సాధారణ స్థితి నెలకొందని.. 3 షిఫ్టుల్లో పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 95 శాతం విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇంకా 6 డివిజన్లలో నీరు నిలిచి ఉందని మంగళవారం సాయంత్రం సాధారణ స్థితికి వస్తే పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి దుస్తులు తెప్పించి సర్వం కోల్పోయిన బాధితులకు పంచే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. 2.75 లక్షల మంది ముంపునకు గురైనందున వారి కష్టాలు తీర్చాలన్నారు. అర్బన్ కంపెనీ సాయంతో పాడైన వస్తువులు బాగు చేయించడం, యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచడంపై మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అటు, సహాయక చర్యల పర్యవేక్షణకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చారు.

అటు, కొల్లేరు వరద కారణంగా లంక గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. పెదఎడ్లగాడి వంతెన వద్ద సోమవారం వరద 3.41 మీటర్లకు పెరిగింది. కైకలూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి బుడమేరు ద్వారా పెద్దఎత్తున కొల్లేరుకు వరద చేరుతోంది. దీంతోపాటు తమ్మిలేరు, రామిలేరుతో పాటు మరో 20 డ్రెయిన్ల నుంచి వరద కొల్లేరు వైపు పరుగులు తీస్తోంది.

ఉత్తరాంధ్రలో వర్ష బీభత్సం

మరోవైపు, భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటి ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు తెగిపోయాయి. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద పోటెత్తడంతో నీటి మట్టాలు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జీకే వీధి మండలం చట్రాయిపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండ చరియలు విరిగి పడడంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్రలో అత్యధికంగా అల్లూరి జిల్లా వై.రామవరంలో 14 సెం.మీ, చింతపల్లి 13.7 సెం.మీ, గంగవరం 12.6, ముంచంగిపుట్టు 12.1, విజయనగరం జిల్లా గోవిందపురం 13.9, పెదనందిపల్లి 12.3, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట 13.1, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో 11.5 సెం.మీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

Also Read: Srikakulam : శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తమ్మినేని! విరుగుడు చర్యలు చేపట్టిన కృష్ణదాస్ 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget