అన్వేషించండి

CM Chandrababu: నల్లమల సాగర్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు - సముద్రంలోకి పోయే నీటినే వాడుకుంటాం - చంద్రబాబు కీలక ప్రకటన

Water disputes : నల్లమల సాగర్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో సాగునీటి రంగంపై కీలక ప్రకటనలు చేశారు.

Chandrababu Naidu spoke in Assembly on projects and water disputes :  రాష్ట్ర భవిష్యత్తు నీటి లభ్యతపైనే ఆధారపడి ఉందని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను జల సమృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, ఈ వృధాను అరికట్టి రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

నదుల అనుసంధానం - ప్రాజెక్టుల పునరుద్ధరణ 

వంశధార నుండి పెన్నా వరకు రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా వివాదాస్పదం అవుతున్న పోలవరం-నల్లమల సాగర్  లింక్ ప్రాజెక్టుపై ఆయన కీలక వివరణ ఇచ్చారు. వృధాగా పోయే నీటినే తాము వాడుకుంటున్నామని, దీనివల్ల పొరుగు రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదని, పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు లాభమే కలుగుతుందని ఉద్ఘాటించారు. గంగా-కావేరీ అనుసంధానం తన చిరకాల స్వప్నమని, ఆ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.       

గత ప్రభుత్వ వైఫల్యాలు - భవిష్యత్తు కార్యాచరణ 

గత ఐదేళ్లలో సాగునీటి రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడం మానవ తప్పిదమేనని, వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేశారని విమర్శించారు. అయితే, ఆ వైఫల్యాలను సరిదిద్ది, వచ్చే ఏడాది జూలై నాటికి వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించి, దశలవారీగా పనులు పూర్తి చేస్తామని, చింతలపూడి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి ఏలూరు, కృష్ణా జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.     

భూగర్భ జలాలే నిధులు - ప్రజా భాగస్వామ్యం 

సాంకేతికతను జోడించి భూగర్భ జలాలను పెంపొందించడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున 7 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతోందని, దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గి రూ. 91 కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. నీటి నిర్వహణ బాధ్యతలను మళ్ళీ నీటి వినియోగదారుల సంఘాలకే అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా, తెలుగు తల్లికి  జలహారతి ఇచ్చేలా ఒక పక్కా బ్లూ ప్రింట్‌తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget