By: ABP Desam | Updated at : 01 May 2023 11:17 AM (IST)
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో రజినీ కాంత్, చంద్రబాబు
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొన్న సూపర్స్టార్ రజనీకాంత్పై వైఎస్ఆర్ సీపీ నేతల స్పందనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలు స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. అహంకారంతో వైఎస్ఆర్ సీపీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలు తెలుగు ప్రజలు ఎవరూ సహించలేరని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై వైఎస్ఆర్ సీపీ నేతలు చేసిన విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే అని తీవ్రంగా ఖండించారు.
‘‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు...ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ… pic.twitter.com/CjyhyviDNb
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023
రాజమండ్రి టీడీపీ నేతల అరెస్టు అక్రమం - చంద్రబాబు
టీడీపీ నేతలు ఆదిరెడ్డి ఆప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ ల అరెస్టు ను ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయే తప్ప...వారిలో మార్పు రావడం లేదు. ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం....అక్రమ కేసులను, అరెస్టులను మాత్రమే నమ్ముకుంది. సిఐడి అనేది దర్యాప్తు ఏజెన్సీనా...లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా? కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ది మారకపోవడం...సిఎం జగన్ విషపు రాజకీయ ఆలోచనలకు నిదర్శన. దుర్మార్గపు ప్రభుత్వం అన్నింటికీ మూల్యం చెల్లిస్తుంది.
చంద్రబాబు మేడే శుభాకాంక్షలు
నేడు (మే 1) మేడే సందర్భంగా చంద్రబాబు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రామిక, కార్మిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. మీ కష్ట ఫలితమే సమాజ ప్రగతి. అందుకే శ్రమజీవుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ది తో ఉంటుంది తెలుగుదేశం పార్టీ. మీ కష్టానికి విలువ పెరిగే మంచి రోజులు రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
చాలా సింపుల్గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్లో కాల్మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ
RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam