అన్వేషించండి

Chandrababu: ప్రపంచవ్యాప్తంగా తెలుగు శక్తిగా ఎదగాలి - జ్యూరిచ్ తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబు పిలుపు

Chandrababu in Zurich: ఐటీ గురించి మాట్లాడినప్పుడు విమర్శలు వచ్చాయని, కానీ నేడు 195 దేశాలలో తెలుగు బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పోరాలో మాట్లాడారు.

Chandrababu in Telugu diaspora :  ప్రపంచ ఆర్థిక వేదిక  వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన పర్యటనను జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంతో ఘనంగా ప్రారంభించారు. 20 దేశాల నుంచి తరలివచ్చిన ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.  తెలుగు వారు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే శక్తివంతమైన కమ్యూనిటీగా ఎదిగారని కొనియాడారు. తాను గతంలో విజన్ 2020 , ఐటీ రంగం గురించి మాట్లాడినప్పుడు విమర్శలు వచ్చాయని, కానీ ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు 195 దేశాలలో తెలుగు బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
 
ఇటీవలి ఎన్నికల్లో కూటమి సాధించిన 93 శాతం స్ట్రైక్ రేట్ విజయం వెనుక ప్రవాస తెలుగు వారి కృషి మరువలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలన్న పిలుపుతో ఎన్నారైలు ఆలోచించకుండా తరలివచ్చి కూటమి కోసం పని చేశారని, కొందరు నేతలు కార్యకర్తలతో సమానంగా కేసులు కూడా ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ సహకరించారని, బీజేపీ కూడా తోడవడంతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించడంపై ఆందోళన ఉన్నా, గత 18 నెలల్లో మళ్లీ ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించామని ధీమా వ్యక్తం చేశారు.

పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ 

రాష్ట్ర అభివృద్ధి కోసం  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  విధానంతో ముందుకు సాగుతున్నామని, దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే దక్కాయని చంద్రబాబు ప్రకటించారు. గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడంతో పాటు, ఆర్సెల్లార్ మిట్టల్ లక్ష కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమను, ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్లతో గ్రీన్ అమోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా కసరత్తు చేస్తున్నామని, ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్ సాంకేతికత - యువతకు పెద్దపీట 

టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో తెలుగు వారు ముందున్నారని, రాబోయే కాలంలో ఏఐ , క్వాంటం, స్పేస్,  డ్రోన్ టెక్నాలజీలకు ఏపీ చిరునామాగా మారబోతోందని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం, వైద్య రంగాల్లో సేవలు అందించేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అనుమతుల విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. తన ప్రభుత్వంలో లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి విద్యావంతులైన యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, యువత సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలని హితవు పలికారు.

సంక్షేమం.. సంస్కరణలు 

తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించడం గర్వకారణమని, నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎకానమీగా అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం కోసం   సంజీవని  ప్రాజెక్టు, ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం, మరియు 958 టీఎంసీల నీటి నిల్వలతో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు తమ మాతృభూమిని, మారుమూల గ్రామాలను మర్చిపోవద్దని, ఆ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.  

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabham Passes Away: ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
TTD Darshan Fraud Arrest: దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget