అన్వేషించండి

Cases On Lokesh : లోకేష్ సహా 33 మంది టీడీపీ నేతలపై కేసులు..!

హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు కేసులు పెట్టారు. 33 మంది టీడీపీ నేతలపై రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు 33 మంది తెలుగుదేశం పార్టీ నేతలపై పాత గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.  ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, అనితలు కేసులు నమోదైన వారిలో ఉన్నారు. వీరిపై పలు అభియోగాలు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, అనుమతి లేకుండా గుమికూడటం, అలాగే పోలీసులను వారి విధులను నిర్వహించకుండా అడ్డుకోవడంతో పాటు  శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో కరోనా  నిబంధనలు ఉల్లంఘించారని నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రతోపాటు మరో పది మంది నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. 

ఆగస్టు 15వ తేదీన ఓ వైపు స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న సమయంలో మరో వైపు గుంటూరు పరమయ్య కుంట ప్రాంతంలో  శశికృష్ణ అనే ఉన్మాది బీటెక్ విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. రమ్యకు నివాళులర్పించి.. కుటుంబసభ్యులను పరామర్శించేందుకు  నారా లోకేష్ వెళ్లారు. పరామర్శించి బయటకు వచ్చిన సమయంలో ఆయన ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు గుమికూడటంతో లోకేష్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకూ అదుపులోనే ఉంచుకుని ఆ తర్వాత  151 సీఆర్‌పీసీ చట్టం కింద నోటీసులు జారీ చేసి వదిలిపెట్టారు. ఈ రోజు ఆ ఘటనల వీడియోలను పరిశీలించిన పోలీసులు కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 

అంతకు ముందు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రమ్య మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రమ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అప్పుడే పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనపై కొత్త పేట పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. మహిళలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం.. వారికి భరోసా ఇవ్వడానికి వెళ్తున్న వారిని మాత్రం అడ్డుకోవడానికి.. వారిపై కేసులు పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

నమోదు చేసిన కేసుల విషయంలో పోలీసులు తదుపరి చర్యలు ఏమి తీసుకుంటారన్నదానిపై స్పష్టత లేదు. నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget