అన్వేషించండి

Cases On Lokesh : లోకేష్ సహా 33 మంది టీడీపీ నేతలపై కేసులు..!

హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు కేసులు పెట్టారు. 33 మంది టీడీపీ నేతలపై రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు 33 మంది తెలుగుదేశం పార్టీ నేతలపై పాత గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.  ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, అనితలు కేసులు నమోదైన వారిలో ఉన్నారు. వీరిపై పలు అభియోగాలు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, అనుమతి లేకుండా గుమికూడటం, అలాగే పోలీసులను వారి విధులను నిర్వహించకుండా అడ్డుకోవడంతో పాటు  శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో కరోనా  నిబంధనలు ఉల్లంఘించారని నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రతోపాటు మరో పది మంది నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. 

ఆగస్టు 15వ తేదీన ఓ వైపు స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న సమయంలో మరో వైపు గుంటూరు పరమయ్య కుంట ప్రాంతంలో  శశికృష్ణ అనే ఉన్మాది బీటెక్ విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. రమ్యకు నివాళులర్పించి.. కుటుంబసభ్యులను పరామర్శించేందుకు  నారా లోకేష్ వెళ్లారు. పరామర్శించి బయటకు వచ్చిన సమయంలో ఆయన ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు గుమికూడటంతో లోకేష్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకూ అదుపులోనే ఉంచుకుని ఆ తర్వాత  151 సీఆర్‌పీసీ చట్టం కింద నోటీసులు జారీ చేసి వదిలిపెట్టారు. ఈ రోజు ఆ ఘటనల వీడియోలను పరిశీలించిన పోలీసులు కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 

అంతకు ముందు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రమ్య మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రమ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అప్పుడే పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనపై కొత్త పేట పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. మహిళలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం.. వారికి భరోసా ఇవ్వడానికి వెళ్తున్న వారిని మాత్రం అడ్డుకోవడానికి.. వారిపై కేసులు పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

నమోదు చేసిన కేసుల విషయంలో పోలీసులు తదుపరి చర్యలు ఏమి తీసుకుంటారన్నదానిపై స్పష్టత లేదు. నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Simsa Mata Temple: జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
Botsa tears: వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స - అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం
వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స - అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం
AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
IPL 2026 KKR VS LSG Result Update: ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. లక్నో సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. LSG సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
Embed widget